Breaking News

డ్రైవర్ లేకుండా 50 కి.మీ. ప్రయాణించి, దానంతటదే ఆగిపోయిన రైలు


ఓ స్టేషన్‌లో ఆగి ఉన్న రైలు ఉన్నట్టుండి కదిలి డ్రైవర్‌ లేకుండానే 50 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. ఈ సమయంలో ఆ రైలును ఆపేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చివరకు దానికదే ఓ స్టేషన్‌లో ఆగిపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని సెంద్రా రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది. ఎల్ అండ్ టీ సంస్థకు చెందిన మెటీరియల్ తరలిస్తోన్న ఓ గూడ్సు రైలును రాజస్థాన్‌లోని సెంద్రా రైల్వేస్టేషన్‌లో డ్రైవర్ నిలిపి ఉంచారు. అందులో నుంచి లోకోపైలట్ కిందికి దిగిన తర్వాత ఆ ఉన్నట్టుండి కదిలింది. మెల్లగా వేగాన్ని అందుకుంటూ స్టేషన్ దాటిపోయింది. దీన్ని గమనించిన అధికారులు తర్వాతి స్టేషన్లను అప్రమత్తం చేశారు. దారిలో ఉన్న రైల్వే గేట్లన్నింటిని మూసేసి, పట్టాలపై రాళ్లు, బస్తాలు వేసి ఆపే ప్రయత్నం చేశారు. అయితే ఈ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. దాదాపు 50 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తర్వాత సోజాత్‌ స్టేషన్‌ దగ్గర రైలు దానంతట అదే ఆగిపోయింది. పెను ప్రమాదం తప్పడంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు నిర్లక్ష్యమే కారణమని విమర్శలు వస్తున్నాయి. ఇంజిన్ ఆన్‌‌లో ఉండగా లోకో పైలట్ కిందికి దిగిపోవడం ఏంటిని వ్యాఖ్యానిస్తున్నారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం జరగలేదని, లేకపోయింటే ఘోరం జరిగిపోయేదని అంటున్నారు. ఈ ఘటనపై ఎల్ అండ్ టీ అధికారులతో మాట్లాడేందుకు ప్రయత్నించగా వారు అందుబాటులోకి రాలేదు. గతేడాది నవంబరులో ఆస్ట్రేలియాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. లోకో పైలట్ లేకుండానే ఏకంగా గూడ్స్ రైలు ఏకంగా 90 కి.మీ. ప్రయాణించింది. అనంతరం పట్టాలు తప్పి నిలిచిపోయింది. 4 ఇంజిన్లు, 268 వ్యాగన్లు గల ఈ రైలు.. న్యూమన్‌ నుంచి పోర్ట్‌ హెడ్‌ల్యాండ్‌కు ఇనుప ధాతువును తరలిస్తుండగా ఈ ఘటన సంభవించింది. రైలును ఆపిన డ్రైవర్.. కిందకు దిగి ఓ వ్యాగన్‌ను పరిశీలిస్తుండగా దానంతట అదే కదిలి ముందుకు దూసుకెళ్లింది. అలా 50 నిమిషాల పాటు 90 కిలోమీటర్ల మేర ప్రయాణించింది.


By September 18, 2019 at 08:59AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/goods-train-running-for-50-km-without-driver-in-sendra-in-rajasthan/articleshow/71177813.cms

No comments