14 రాష్ట్రాల్లో వెయ్యికి పైగా కేసులు.. నెల్లూరులో చిక్కిన హర్యానా గ్యాంగ్

ఏటీఎం కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దేశవ్యాప్తంగా చోరీలకు పాల్పడుతున్న హర్యానా దొంగల ముఠా ఎట్టకేలకు చిక్కింది. ఎన్నో రాష్ట్రాల పోలీసులు గాలిస్తున్న ఈ ముఠాకు చెందిన సభ్యులను నెల్లూరు జిల్లా పోలీసులు ఎంతో చాకచక్యంగా పట్టుకుని శభాష్ అనిపించుకున్నారు. ఏటీఎం కేంద్రాల వద్ద వృద్ధులు, నిరక్షరాస్యులు, కార్డు వినియోగించడం తెలియనివారిని వీరు లక్ష్యంగా చేసుకుని దోచుకుంటున్నారని నెల్లూరు ఎస్పీ ఐశ్వర్య రస్తోగి తెలిపారు. నిందితులను శుక్రవారం ఆయన మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. Also Read: హర్యానాలోని భివాని జిల్లా బార్మి గ్రామానికి చెందిన సందీప్ కుమార్, మంజిత్, జగ్జీత్ ముఠాగా ఏర్పడి తెలుగు రాష్ట్రాలతో పాటు మొత్తం 14 రాష్ట్రాల్లో వెయ్యికిపైగా మోసాలకు పాల్పడ్డారు. ముందుగా చోరీలకు పాల్పడాల్సిన రాష్ట్రాన్ని ఎంపిక చేసుకుని ఆ ప్రాంతానికి రైళ్లు, విమానాల్లో చేరుకుంటారు. ఎయిర్పోర్టుల వద్ద సొంతంగా డ్రైవింగ్ చేసుకునే కార్లను అద్దెకు తీసుకుని వివిధ ప్రాంతాలను పరిశీలిస్తుంటారు. ఏటీఎం సెంటర్ల వద్ద తిరుగుతూ క్యాష్ విత్డ్రా కోసం వచ్చే వృద్ధులు, ఏటీఎం కార్డు ఉపయోగించడం తెలియని వారిని టార్గెట్ చేసుకుంటారు. వారితో మాటలు కలిపి మంచిగా నటిస్తూ కార్డు నంబర్, పిన్ నంబర్ సేకరిస్తారు. Also Read: తాము సేకరించిన వివరాల ఆధారంగా ఆ కార్డులను క్లోనింగ్ చేసి వారి అకౌంట్లలో ఉన్న డబ్బును కొట్టేస్తారు. ఎనిమిదో తరగతి మాత్రమే చదివిన సందీప్ కుమార్ ఏటీఎం కార్డును సెకన్ల వ్యవధిలోనే క్లోనింగ్ చేయడంలో ఆరితేరాడని పోలీసులు తెలిపారు. ఈ ముఠాపై ఏపీలోనే 47కేసులు నమోదైనట్లు వెల్లడించారు. Also Read:
By September 28, 2019 at 07:57AM
No comments