Breaking News

న్యాక్‌లో కలకలం.. బల్లి పడిన ఆహారం తిని 13 మందికి అస్వస్థత


తిరుపతిలోని ఏపీ నైపుణ్య శిక్షణాభివృద్ధి సంస్థ(న్యాక్‌)లో సోమవారం ఒక్కసారిగా కలకలం రేగింది. వివిధ కోర్సుల్లో ట్రైనింగ్ తీసుకుంటున్న విద్యార్థులు సోమవారం రాత్రి పడిన ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారు. 13 మంది తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎస్వీ మెడికల్ కాలేజ్ ఎదురుగా ఉన్న న్యాక్‌‌లో 25 మంది విద్యార్థులు వివిధ కోర్సుల్లో చేరారు. వీరంతా హాస్టల్‌లో ఉంటూ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. వీరంతా సోమవారం రాత్రి హాస్టల్‌లో చపాటి, కుర్మా తిన్నారు. ఓ విద్యార్థికి కుర్మాలో బల్లి కనిపించడంతో అంతా షాకై వాంతులు చేసుకున్నారు. 13 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో వెంటనే రుయా ఆస్పత్రికి తరలించారు. విద్యార్థులకు చికిత్స అందించిన డాక్టర్లు.. ప్రస్తుతం వారి పరిస్థితి బాగానే ఉందని, ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు. హాస్టల్‌లో నాలుగు రోజులుగా ఆహారం బాగోలేదని చెబుతున్నా నిర్వాహకులు పట్టించుకోవడం లేదని విద్యార్థులు చెబుతున్నారు. కిచెన్ అపరిశుభ్రంగా ఉండటంతో తాము అనారోగ్యానికి గురవుతున్నామన్నారు. న్యాక్ అసిస్టెంట్ డైరెక్టర్ విజయ్‌ప్రతాప్ ఈ ఘటనపై స్పందిస్తూ విద్యార్థులకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని తెలిపారు. హాస్టల్‌లో సేవలు మెరుగుపరుస్తామని, మరోసాని ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు.


By September 17, 2019 at 09:14AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/lizard-in-food-illness-for-13-students-tirupati-nach/articleshow/71160942.cms

No comments