Breaking News

Mahesh Babu: ‘సరిలేరు నీకెవ్వరు’ టైటిల్ సాంగ్.. ఇండియన్ ఆర్మీకి సలాం


స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా అభిమానులకు అదిరిపోయే కానుక ఇచ్చారు సూపర్ స్టార్ . ఆయన నటించిన ‘సరిలేరు నీకెవ్వరూ’ చిత్రం నుండి టైటిల్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ సాంగ్‌ను సైనికులకు డెడికేట్ చేస్తూ సైనికుడిగా అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు మహేష్ బాబు. దేశ సరిహద్దుల్లో సైనికులు దేశం కోసం ఎలా పోరాడుతున్నారో విజువల్‌గా చూపించారు. ‘భగభగమండే నిప్పుల వర్షం వచ్చినా.. జనగణమన అంటూనే దూకేవాడే సైనికుడు’ అంటూ సాగిన ఈ పాటల ఇండో పాక్ వార్ 1971, కార్గిల్ వార్ నాటి పరిస్థితుల్ని గుర్తు చేశారు. ఇందులో మహేష్ బాబు మేజర్ అజయ్ క్రిష్ణగా కనిపించారు. Read Also: అయితే ఈ టైటిల్ సాంగ్‌ను సినిమా పరంగా అంత గొప్పగా కంపోజ్ చేయలేకపోయారు దేవి శ్రీ ప్రసాద్. లిరిక్స్‌ కూడా చదివినట్టుగా నామమాత్రంగా ఉన్నాయి. భరత్ అనే నేను, మహర్షి వరుస బ్లాక్ బస్టర్ హిట్ల తరువాత సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ‘సరిలేరు నీకెవ్వరు’లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ‘F2’ డైరెక్టర్‌ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీవెంకటేశ్వరా క్రియేషన్స్, ఏకే ఎంటర్‌టైన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో రష్మిక మందనా, అదితీ రావు హైదరీ హీరోయిన్లుగా నటిస్తున్నారు.


By August 15, 2019 at 07:53AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/mahesh-babu-sarileru-neekevvaru-title-song-a-tribute-to-the-indian-army/articleshow/70684947.cms

No comments