Breaking News

ప్రియుడిని చితకబాది బీటెక్ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్


జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రియుడితో మాట్లాడేందుకు నిర్మానుష్య ప్రాంతానికి ఇంజినీరింగ్ విద్యార్థినిపై ముగ్గురు కామాంధులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆగస్టు 3వ తేదీన ఈ ఘటన జరగగా, బాధితురాలు అనారోగ్యానికి గురికావడంతో 20రోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది. బాధితురాలు తల్లితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. చిత్తూరు జిల్లా కురబలకోట మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి (20) ఇంజినీరింగ్‌ చదువుతోంది. ఈ నెల 3వ తేదీన మాట్లాడాలని ప్రియుడు పిలవడంతో మండలంలోని హంద్రీనీవా కాలువ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లింది. ప్రేమికులిద్దరూ మాట్లాడుకుంటున్న సమయంలో అదే మండలానికి చెందిన అస్రఫ్‌, జయచంద్ర, మస్తాన్‌వల్లి అనే యువకుడు మద్యం తాగేందుకు అక్కడికి వచ్చారు. మీకు ఇక్కడేం పని అంటూ ప్రేమజంటను బెదిరించారు. యువతిపై వారి కన్ను పడటంతో ప్రియుడిని చితక్కొట్టి అక్కడి నుంచి పంపించివేశారు. ఆ తర్వాత ఆమెను వివస్త్రను చేసి ఒకరి తర్వాత ఒకరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించడంతో ఆమె గుట్టుచప్పుడు కాకుండా ఇంటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి బాధితురాలు ముభావంగా ఉండటంతో ఏం జరిగిందని తల్లి ప్రశ్నించినా సమాధానం చెప్పలేదు. రెండ్రోజుల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో తల్లి నిలదీయగా తనపై జరిగిన దారుణాన్ని వెల్లడించింది. దీంతో ఆమె తల్లి బాధితురాలిని మదనపల్లి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


By August 23, 2019 at 08:53AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/b-tech-student-gang-raped-in-chittoor-district-case-filed/articleshow/70797604.cms

No comments