Breaking News

రామోజీరావు ఆరోగ్యం బాగోలేదా..? సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం!


ఈనాడు సంస్థల అధినేత ఆరోగ్యం బాగాలేదని వార్త గత మూడు రోజులుగా వాట్సాప్ గ్రూపుల్లో హల్‌చల్ చేస్తోంది. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయన కోసం ఫిల్మ్ సిటీలోనే ఐసీయూ ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారని, విదేశాల్లో వైద్యానికి ఆయన నిరాకరిస్తున్నారంటూ సురేష్ అనే వ్యక్తి పేరుతో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమధ్య రామోజీ అనారోగ్యంతో బాధపడ్డారు. వయసు మీద పడటంతో కొద్ది రోజులు చికిత్స తీసుకున్నారు. దీంతో రామోజీ ఆరోగ్యం బాగోలేదని ఇప్పుడు జరుగుతోన్న ప్రచారం కూడా నిజమే అనుకున్నారు. వాస్తవానికి రామోజీరావు ఆరోగ్యంగానే ఉన్నారు. ఎప్పటిలాగే కంపెనీల వ్యవహారాలన్నీ దగ్గరుంచి చూసుకుంటున్నారు. గత 50 ఏళ్లుగా ఆయన దినచర్య ఎలా ఉందో ఇప్పటికీ దాన్నే కొనసాగిస్తున్నారు. వయసు మీద పడుతున్నప్పటికీ ఆయన మరింత ఉత్సాహంగా పని చేస్తున్నారు. పనిలోనే విశ్రాంతి అనే నినాదాన్ని కచ్చితంగా అమలు చేస్తున్నారు. వైట్ అంట్ వైట్ డ్రస్‌లో రామోజీఫిల్మ్ సిటీలోని తన ఇంటి నుంచి అక్కడే ఉన్న ఆఫీసుకు క్రమం తప్పకుండా వెళ్తున్నారు. నిత్యం ఉద్యోగులతో మీటింగులు నిర్వహిస్తున్నారు. కొన్ని కొన్ని అంశాల్లో ఆయన ఇచ్చే సలహాలు, సూచనలు చూసి ఉద్యోగులే ఆశ్చర్యపోతున్నారు. ఇంత వయసు వచ్చినా ఆయన షార్ప్‌గా ఆలోచిస్తున్న తీరు ఆశ్చర్యపరుస్తోంది. రామోజీరావు ఆరోగ్యం బాగానే ఉందనడానికి మరో ఉదాహరణ.. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆయన చేతుల మీదుగా ఓ పుస్తకాన్ని ఆవిష్కరించబోతున్నారు. ‘‘ఎడారిలో ఒయాసిస్సు - ఇజ్రాయెల్‌లో వ్యవసాయం’’ పేరిట తాను రాసిన పుస్తకాన్ని రామోజీ ఆవిష్కరిస్తారని ఈనాడు గ్రూప్‌కి చెందిన జర్నలిస్ట్ అమర్నేని హరికృష్ణ ఫేస్‌బుక్ ద్వారా వెల్లడించారు. దీన్ని బట్టి ఎవరో ఉద్దేశపూర్వకంగా రామోజీ ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. రామోజీరావు అనారోగ్యంగా ఉన్నారంటూ, అది కూడా అంపశయ్య మీద ఉన్నారనే తప్పుడు వార్త వెనుక ఏదైనా కుట్ర ఉందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ వ్యవహారంపై చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మెసేజీ ఇదే.. అంపశయ్య పై ఈనాడు గ్రూప్ అధినేత రామోజీ రావు. తీవ్ర అనారోగ్యం తో ఐ సి యూ లో రామోజీ విదేశాల్లో వైద్యం అంగీకరించని రామోజీ తను చని పోతే భారత గడ్డ మీద మాత్రమే అంటున్న దేశ భక్తుడు రామోజీ రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక ఐ సి యూ ఏర్పాటు చేసిన వైద్యులు, ఒక మూసలాంటి జర్నలిజం ను కొత్త పుంతలు తొక్కించిన రామోజీ రామోజీ కి దేవుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వాలి అని కోరుకుంటూ ... మీ సురేష్


By August 26, 2019 at 01:23PM


Read More https://telugu.samayam.com/telangana/news/fake-news-spreading-about-eenadu-group-chairman-ramoji-rao-health/articleshow/70839098.cms

No comments