Breaking News

నేడు జాబిల్లి కక్ష్యలోకి ‘చంద్రయాన్-2’... సెప్టెంబర్ 7న ల్యాండింగ్


భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రయోగించిన ప్రాజెక్టులో మరో కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది. మంగళవారం ఉదయం 9.30 గంటలకు చంద్రయాన్-2 చంద్రని కక్ష్యలోకి ప్రవేశించనుంది. జులై 22న జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌3ఎం1 ద్వారా రోదసిలోకి వెళ్లిన చంద్రయాన్‌-2 ఉపగ్రహం 29రోజుల తర్వాత కీలక ఘట్టానికి చేరుకుంది. ఈరోజు ఉదయం 9.30 గంటల సమయంలో ద్రవ ఇంజిన్‌ను మండిచడం ద్వారా ఇస్రో శాస్త్రవేత్తలు ఉపగ్రహాన్ని విజయవంతంగా చంద్రుని కక్షలోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ కీలక ఘట్టం ద్వారా చంద్రయాన్-2 చంద్రుని కక్ష్యకు 150 కిలోమీటర్ల దూరానికి చేరింది. ఉపగ్రహం వేగం తగ్గించుకుని దశ, దిశ మార్చుకుని విజయవంతంగా జాబిల్లి కక్ష్యలోకి చేరుకోనుంది. సెప్టెంబర్ 2వ తేదీన ల్యాండర్‌పై రెండు విన్యాసాలు చేపట్టడం ద్వారా ల్యాండింగ్ సాఫీగా జరిగేలా శాస్త్రవేత్తలు ప్రయోగం చేయనున్నారు. అన్ని ప్రక్రియలు ముగిసిన తర్వాత సెప్టెంబర్ 7వ తేదీన తెల్లవారుజామున 1.30-2.30 గంటల మధ్యలో ల్యాండర్ చంద్రుడిపై విజయవంతంగా ల్యాండ్ కానుంది. ల్యాండర్ చంద్రుడిపై దిగిన నాలుగు గంటల తర్వాత ఆరు చక్రాలు కలిగిన రోవర్ బయటకు వస్తుంది. సెకనుకు సెంటీమీటర్ వేగంతో పనిచేసే ఈ రోవర్ చంద్రుడిపై 14రోజుల్లో 400 మీటర్ల దూరం ప్రయాణించనుంది. అక్కడ తీసే ప్రతి విజువల్‌ని 15 నిమిషాల వ్యవధిలో భూమికి చేరవేస్తుంది. ఆర్బిటర్, ల్యాండర్‌లో ఏర్పాటుచేసిన కెమెరాల ల్యాండింగ్ టైమ్‌లో ఫోటోలు తీసి పంపనున్నాయి.


By August 20, 2019 at 08:13AM


Read More https://telugu.samayam.com/latest-news/science-technology/chandrayaan-2-ready-to-enter-in-moon-orbit-on-tuesday/articleshow/70747212.cms

No comments