Breaking News

పక్కింటి మహిళతో అఫైర్.. రెండో పెళ్లికి భార్య ఒప్పుకోలేదని ఆత్మహత్య


పెళ్లయి భార్య, ఇద్దరు పిల్లలున్న వ్యక్తి భర్తను వదిలేసి పుట్టింట్లో ఉంటున్న మహిళతో పెట్టుకున్నాడు. ఆమెను విడిచి ఉండలేక రెండో భార్యగా చేసుకుందామనుకున్నాడు. ఇదే విషయాన్ని భార్యకు చెబితే ఆమె ససేమిరా అంది. దీంతో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా మంగళగిరిలో శనివారం సాయంత్రం జోటుచేసుకుంది. మంగళగిరికి చెందిన వివాహితుడు సత్యనారాయణకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతడి ఇంటి సమీపంలోనే ఉండే ఓ కుటుంబానికి చెందిన మహిళ భర్త వేధింపులు భరించలేక మూడేళ్లుగా పుట్టింట్లోనే ఉంటోంది. ఈ నేపథ్యంలో ఆ మహిళతో సత్యనారాయణకు పరిచయం ఏర్పడి అక్రమ సంబంధంగా బలపడింది. ఇద్దరూ వీలుచిక్కనప్పుడల్లా ఏకాంతంగా గడిపేవారు. ఈ విషయం సత్యనారాయణ భార్యకు తెలియడంతో అతడిని నిలదీసింది. ఆ మహిళ అంటే తనకు ఇష్టమని, ఆమె లేకుండా బతకలేనని, అందుకే రెండో వివాహం చేసుకుందామని అనుకుంటున్నానని సత్యనారాయణ చెప్పడంతో భార్య షాకైంది. ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు తెలియడంతో అందరూ సత్యనారాయణను తిట్టిపోశారు. చెడు తిరుగుళ్లు మానేసి బుద్ధిగా భార్యతో కాపురం చేసుకోవాలని సూచించారు. అయితే ఒకరంటే ఒకరు విడిచి ఉండలేని స్థితికి చేరుకున్న సత్యనారాయణ, ఆ మహిళ కలిసి బతకడం కుదరనప్పుడు చనిపోవడమే మేలనుకున్నారు. శనివారం మధ్యాహ్నం కొండపై ఉన్న పానకాల స్వామి ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకున్నారు. అనంతరం పక్కనే చెట్ల పొదల్లోకి కాసేపు ఏకాంతంగా గడిపారు. ఆ తర్వాత తాము విషయం ఆత్మహత్య చేసుకుంటున్నట్లు మహిళ తన తండ్రికి ఫోన్ చేసి చెప్పింది. అతడు వచ్చేలోగానే ఇద్దరూ విషయం తాగారు. అయితే తన ప్రియురాలు విషయం తాగుతుండగా గ్లాసు లాక్కున్న సత్యనారాయణ మిగిలిన విషం కూడా తానే తాగేశాడు. ఆ మహిళ తండ్రి ఇద్దరినీ మంగళగిరిలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే సత్యనారాయణ చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. యువతి అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


By July 28, 2019 at 01:38PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/mangalagiri-illegal-affair-couple-commits-suicide-attempt-man-died/articleshow/70418424.cms

No comments