జైపాల్రెడ్డి, నేనూ బెంచ్మేట్స్: ఉపరాష్ట్రపతి
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్లో జైపాల్రెడ్డి నివాసానికి చేరుకున్న వెంకయ్యనాయుడు ఆయన భౌతికకాయానికి పుష్ఫాంజలి ఘటించారు. కుటుంబసభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓ స్నేహితుడిని కోల్పోయాను. ఈ లోకం నుంచి జైపాల్రెడ్డి వెళ్లిపోయినా.. ఆ సేవలను ప్రజలు ఎప్పుడూ స్మరించుకుంటూనే ఉంటారు. జైపాల్తో నాకు ఎంతో అనుబంధముంది. ఉమ్మడి ఏపీ అసెంబ్లీలో మేమిద్దరం ఒకే బెంచీలో రెండుమూడుసార్లు కూర్చున్నాం. ప్రతిపక్షంలో ఉన్నా మా వంతు బాధ్యత నిర్వర్తించాం. జైపాల్రెడ్డి మేథాశక్తి, విమర్శనా శైలి, విషయ పరిజ్ఞానం, భాషా ప్రావీణ్యం అద్భుతం. భారత రాజకీయాల్లో ఆయనలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు’ అని వెంకయ్యనాయుడు కొనియాడారు. రాష్ట్రపతి, ప్రధాని సంతాపం జైపాల్రెడ్డి మృతిపట్ల రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. జైపాల్రెడ్డి ఉత్తమ పార్లమెంటేరియన్గా అరుదైన గుర్తింపు తెచ్చుకున్నారని రాష్ట్రపతి కొనియాడారు. జైపాల్రెడ్డి లాంటివారు రాజకీయాల్లో అరుదని, దేశం మంచి వక్తని కోల్పోయిందని ప్రధాని మోదీ అన్నారు.
By July 28, 2019 at 11:34AM
No comments