ఏపీ బడ్జెట్ ప్రవేశపెట్టే టైమ్లో మార్పు... కన్నబాబు ప్లేస్లో బొత్స

అసెంబ్లీలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాయత్తమైంది. బడ్జెట్కు తుది మెరుగులు దిద్దిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి సిద్ధమయ్యారు. అయితే బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో ప్రభుత్వం స్వల్ప మార్పులు చేసింది. షెడ్యూల్ ప్రకారం బడ్జెట్ను శాసనసభలో ఉదయం 11 గంటలకు ప్రవేశపెట్టాల్సి ఉంది. అయితే స్వల్ప మార్పులు చేస్తూ మధ్యాహ్నం 12.22 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అదే సమయానికి శాసనమండలిలో ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్చంద్రబోస్ బడ్జెట్ ప్రసంగం చేయనున్నారు. శాసనసభలో ఆర్థిక బడ్జెట్ ప్రసంగం అనంతరం మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. అదే సమయంలో పశు సంవర్థకశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ మండలిలో వ్యవసాయ బడ్జె్ట్ ప్రవేశపెడతారు. శాసనసభలో వ్యవసాయ బడ్జెట్ను వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ప్రవేశపెట్టాల్సి ఉంది. అయితే గురువారం కన్నబాబు సోదరుడు సతీష్(43) గుండెపోటుతో విజయవాడలోని ఆంధ్రా ఆస్పత్రికిలో కన్నుమూశారు. సోదరుడి ఆకస్మిక మృతితో షాకైన ఆయన మంత్రి హుటాహుటిన స్వస్థలమైన కాకినాడ చేరుకున్నారు.
By July 12, 2019 at 11:02AM
No comments