Breaking News

ఆగస్టులో సచివాలయం తరలింపు షురూ!


తరలింపు ప్రక్రియను ప్రభుత్వ వేగవంతం చేస్తోంది. అమావాస్య తర్వాత వచ్చే శ్రావణమాసంలో అన్ని కార్యాయాలను తరలించే ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం. ఆయా కార్యాలయాల తరలింపును ఎప్పుడు ప్రారంభించి, ఎప్పటిలోగా పూర్తిచేస్తారో చెప్పాలని అడ్మినిస్ట్రేషన్ విభాగం అన్ని శాఖలకు చెక్ లిస్టులు పంపింది. సచివాలయ తరలింపుపై ఇప్పటికే అన్ని శాఖాధిపతులకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది. భవనాల కేటాయింపుఆర్థిక, ప్రణాళిక, హోం తదితర శాఖలతో పాటు ఇతర శాఖలను బీఆర్కే భవన్‌కు తరలించాలని సాధారణ పరిపాలన శాఖ ప్లాన్ రూపొందించింది. సీఎంవోతో పాటు జీఏడీ కార్యాలయాన్ని బేగంపేటలోని హైదరాబాద్ మెట్రో రైల్ భవనానికి తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ భవనం ముఖ్యమంత్రి క్యాంపు ఆఫీసైన ప్రగతి భవన్‌కు దగ్గరగా ఉందన్న భావనతో ఆ రెండు విభాగాలను అక్కడికి తరలించాలని యోచిస్తున్నారు. సచివాలయ శాఖలకు చెందిన ఫైళ్లు, ఫర్నిచర్‌ను ఆయా భవనాలకు తరలించే కాంట్రాక్టును ప్రభుత్వం ప్యాకర్స్ అండ్ మూవర్స్ సంస్థను ఎంపిక చేసింది. ఫైళ్లు, సరంమాజా సర్దుకోవడానికి ఎంతకాలం పడుతుందో, రవాణా చేయడానికి ఎన్ని వాహనాలు కావాలో తమకు తెలపాలని సాధారణ పరిపాలన విభాగం అన్ని శాఖలకు సూచించింది.


By July 28, 2019 at 11:02AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/telangana-government-to-move-telangana-secretariat-in-august/articleshow/70417170.cms

No comments