Breaking News

సాయంత్రంలోగా స్పీకర్‌ను కలవండి: రెబెల్స్ ఎమ్మెల్యేలకు సుప్రీం ఆదేశం


కర్ణాటకలో రాజకీయ సంక్షోభం చివరి దశకు చేరుకుంది. రెబెల్స్ ఎమ్మెల్యేలందరూ ఈరోజు సాయంత్రంలోనూ స్పీకర్‌ను కలవాలని ఆదేశించింది. తమ రాజీనామాలను వెంటనే ఆమోదించేలా స్పీకర్‌కు ఆదేశాలివ్వాలంటూ పది మంది ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వారి తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ పిటిషన్ దాఖలు చేశారు. తాము స్వచ్ఛందంగా రాజీనామాలు ఇస్తే స్పీకర్ ఆమోదించకుండా ఆలస్యం చేస్తున్నారని, 12వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతుంటే తమను కూడా అదేరోజు కలవాలని ఆదేశించడం వెనుక దురుద్దేశం ఉందని రెబెల్స్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్‌ అత్యవసరంగా భావించిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ దీనిపై గురువారమే విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలంతా ఈరోజు సాయంత్రమే స్పీకర్ రమేష్‌కుమార్ ఎదుట హాజరుకావాలని సూచించింది. ఆ సమయంలో ఎమ్మెల్యేలందరికీ భద్రత కల్పించాలని కర్ణాటక డీజీపీని ఆదేశించింది. ప్రస్తుతం 10మంది రెబెల్స్ ఎమ్మెల్యేలు ముంబయిలోని ఓ హోటల్‌లో ఉన్నారు. సుప్రీం ఆదేశాలతో వీరంతా ప్రత్యేక విమానంలో ముంబయి నుంచి బెంగళూరు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.


By July 11, 2019 at 11:41AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/supreme-court-directs-karnataka-10-rebel-mlas-to-appear-before-speaker-by-6-pm/articleshow/70169718.cms

No comments