చట్టసభల్లో బల్లలరిగేలా కూర్చొని బ్యాక్ సీట్లు పెంచడం కాదు.. 'పీవీపీ' సెటైర్లు
విజయవాడ టీడీపీలో కుమ్ములాటలు మొదలయ్యాయి.. ఇద్దరు నేతల మధ్య ట్వీట్ ముదిరింది. ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఈ ట్వీట్ వార్ రాజకీయాల నుంచి వ్యక్తిగత విషయాలపై ట్వీట్లు చేసుకునే వరకు వెళ్లింది. ఏకంగా పార్టీకి రాజీనామా చేస్తానంటూ.. చంద్రబాబునే ప్రశ్నించడం సంచలనం రేపింది. తాజాగా ఈ ఇద్దరి ట్వీట్ వార్పై వైసీపీ నేత (పొట్లూరి వరప్రసాద్) స్పందించారు. ట్విట్టర్లో ‘చట్టసభలలో బల్లలరిగేలా కూర్చుని.. పిర్రలు పెంచడం కాదు.. మిమల్ని ఎన్నుకున్న ప్రజలకు ఏమైనా చేసేది ఉందా లేక ట్విట్టెర్లోనే కూర్చుని కాలక్షేపం చేస్తారా??.. ఏది ఏమైనా మీ ఇద్దరు చేసుకున్న పరస్పర ఆరోపణలతో ప్రజలంతా ముక్తకంఠంతో ఏకీభవిస్తునాము.. జైహింద్’ అంటూ ట్వీట్ చేశారు. నేతల మధ్య ట్విట్టర్ వార్లో తాజాగా పీవీపీ కూడా తలదూర్చడం విజయవాడ రాజకీయాల్లో హీట్ పెంచుతోంది. వివాదాలకు దూరంగా ఉండే పొట్లూరి.. ఏకంగా ఇప్పుడు టీడీపీ నేతల్ని టార్గెట్ చేయడం ఆసక్తిగా మారింది. మరి పీవీపై చేసిన వ్యాఖ్యలకు టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది.
By July 15, 2019 at 11:51AM
No comments