Breaking News

కర్నాటకం.. ఈసారి పక్కగా ‘ఆపరేషన్ కమల’!


కన్నడ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. గతేడాది జూన్‌లో ఏర్పాటుచేసిన కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయే దశలో ఉంది. శనివారం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్, జేడీఎస్‌లకు చెందిన 13 మంది ఎమ్మెల్యేలు శనివారం అనూహ్యంగా రాజీనామా చేయడంతో కుమారస్వామి సర్కారు చిక్కుల్లో పడింది. స్పీకర్ అందుబాటులోకి లేకపోవడంతో తమ రాజీనామా లేఖలను అక్కడ కార్యదర్శికి అందజేశారు. ఈ సమయంలో కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ స్పీకర్ కార్యాలయానికి చేరుకుని అసమ్మతి ఎమ్మెల్యేలను బుజ్జగించే ప్రయత్నం చేశారు. వారు మాత్రం వెనక్కు తగ్గకపోగా, అనంతరం గవర్నర్ వాజూభాయ్ వాలాను కలిసి రాజీనామాలు సమర్పించారు. అసంతృప్త ఎమ్మెల్యేలంతా రాజ్‌భవన్ నుంచి నేరుగా మహారాష్ట్ర, గోవాలకు తరలివెళ్లారు. ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ప్రత్యేక విమానంలో గోవా వెళ్తున్నట్టు అసమ్మతి కాంగ్రెస్ ఎమ్మెల్యే బీసీ పాటిల్ మీడియాకు తెలిపారు. ప్రత్యేక విమానంలో గోవా వెళ్లేందుకు హెచ్ఏఎల్ విమానాశ్రయానికి చేరుకున్న ఆయన, పై విధంగా వెల్లడించారు. మరోవైపు, ఎమ్మెల్యేల రాజీనామాతో కాంగ్రెస్ అధిష్టానం అప్రమత్తమైంది. పరిస్థితిని చక్కదిద్దేందుకు కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ కేసీ వేణుగోపాల్‌ను బెంగళూరుకు పంపింది. ఇప్పటికే చేపట్టిన విఫలమవడంతో బీజేపీ ఈసారి పక్కా వ్యూహంతో ముందుకెళుతున్నట్టు సమాచారం. అసమ్మతి ఎమ్మెల్యేల రాజీనామాల వ్యవహారం ఆర్ఎస్ఎస్ నేత బీఎల్ సంతోష్ ఆధ్వర్యంలో నడుస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ రాజీనామాలతో తమకెలాంటి సంబంధం లేదని బీజేపీ నేతలు అంటున్నారు. కానీ, ప్రభుత్వ ఏర్పాటుకు తెరవెనుక చకచకా పావులు కదపుతున్నట్టు భోగట్టా. ఇందుకు గవర్నర్‌ను అనుమతి కోరినట్టు తెలుస్తోంది. Read Also: ప్రస్తుతం కర్ణాటక శాసనసభలో 224 మంది సభ్యులు ఉండగా, కాంగ్రెస్- జేడీఎస్ కూటమి బలం 118. వీరిలో 14 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ఇది 104కు పడిపోయింది. ఒకవేళ వీరి రాజీనామాలను స్పీకర్ ఆమోదిస్తే సభలో సభ్యుల సంఖ్య 210కి చేరుతుంది. ప్రస్తుతం బీజేపీకి 105 మంది ఎమ్మెల్యేలు ఉండగా, కాంగ్రెస్-జేడీఎస్ కూటమి 104 ఉంటుంది. దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి బలపరీక్షలో సునాయాసంగా విజయం సాధించవచ్చని కమలనాథులు భావిస్తున్నారు. కాగా, గవర్నర్ వాజుభాయ్ వాలాతో సమావేశం అనంతరం జేడీఎస్ ఎమ్మెల్యే విశ్వనాథ్ మాట్లాడుతూ.. 14 మంది ఎమ్మెల్యేలు తమ రాజీనామా పత్రాలను స్పీకర్‌కు అందించి ఆమోదించాల్సిందిగా కోరినట్టు తెలిపారు.


By July 07, 2019 at 09:45AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/jds-congress-coalition-government-reduced-to-minority-after-13-disgruntled-mlas-resignations/articleshow/70111958.cms

No comments