భార్యను కాల్గర్ల్గా చిత్రీకరించిన ప్రబుద్ధుడు.. సోషల్మీడియాలో వేధింపులు
నర్సుగా పనిచేస్తున్న యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడు ఆమెతో మనస్పర్ధలు రావడంతో నీచానికి పాల్పడ్డాడు. కట్టుకున్న భార్యనే వ్యభిచారిణిగా చిత్రీకరించి సోషల్మీడియాలో అసభ్యకర ఫోటోలు, ఫోన్ నంబర్ పోస్టు చేశాడు. ఫోన్లో లైంగిక వేధింపులు రావడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో భర్త చేసిన ఘనకార్యం వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కల్వకోల్కు చెందిన పెంజర్ల రవీందర్ (27) ఐదేళ్ల క్రితం హైదరాబాద్లోని ఓ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేశాడు. అక్కడే నర్సుగా పనిచేసే యువతితో అతడికి చనువు పెరిగి ప్రేమగా మారింది. దీంతో ఇద్దరూ సినిమాలు, షికార్లకు తిరిగారు. 2015లో అక్కడ పనిమానేసిన యువతి వేరే ఆస్పత్రిలో చేరింది. దీంతో రవీందర్ కూడా అక్కడ పనిమానేసి యువతి రూమ్కి వచ్చేశాడు. కొంతకాలం సహజీవనం తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత రవీందర్ భార్య మెయిల్ ఐడీతో ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసి తనకు చెందిన ప్రతి విషయాన్ని పోస్ట్ చేసేవాడు. ఓ రోజు అతడి ఫోన్లో ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసిన భార్య చాలామంది అమ్మాయిలతో చాటింగ్ చేస్తున్న విషయాన్ని గుర్తించి నిలదీసింది. దీంతో భార్యతో గొడవపడిన రవీందర్ ఆమెను వదిలేసి స్వగ్రామానికి వెళ్లిపోయాడు. అక్కడి నుంచి భార్యను వేధించడం మొదలుపెట్టాడు. ఆమె ఫోటోలను సోషల్మీడియాలో పోస్ట్ చేస్తూ కాల్గర్ల్ కావాలంటే ఈ నంబర్కు ఫోన్ చేయాలంటూ నంబర్ కూడా పోస్ట్ చేశాడు. దీంతో చాలామంది బాధితురాలికి ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడేవారు. తన భర్తే ఈ దారుణానికి ఒడిగట్టాడని తెలుసుకున్న ఆమె సరూర్నగర్ మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితుడిని మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
By July 31, 2019 at 10:55AM
No comments