Breaking News

71 శాతం పనులు చేశామన్న టీడీపీ, పరిహారం ఏదన్న వైసీపీ.. పోలవరంపై అసెంబ్లీలో రచ్చ


ప్రాజెక్టు విషయమై శుక్రవారం అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ.. 2014 వరకు 7.2 శాతం పనులు మాత్రమే జరిగాయన్నారు. అంతకు ముందు కేవలం మట్టిపనులు మాత్రమే చేశారు.. కానీ గత ఐదేళ్లలో 71 శాతం పనులు జరిగాయని తెలిపారు. భూసేకరణకు రూ.18 వేల కోట్లకుపైగా ఖర్చు పెట్టారన్న ఆయన.. మరో రూ.400 కోట్లు ప్రస్తుతం ఖర్చు చేస్తే చాలన్నారు. కాపర్ డ్యామ్ వద్దని ఆందోళన చేసిన వైఎస్ఆర్సీపీ నేతలే.. ఇప్పుడు కాపర్ డ్యాంలు కావాలి అంటున్నారని ఎద్దేవా చేశారు. పునరావాసానికి సంబంధించి కేంద్రం ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోవడం వల్లే నిర్వాసితులకు పరిహారం చెల్లించలేకపోయామన్నారు. పోలవరం ప్రాజెక్టును జగన్ చేతుల మీదుగా ప్రారంభించి తీరుతామని నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. శుక్రవారం అసెంబ్లీలో మాట్లాడిన ఆయన.. పోలవరంపై జగన్ సమీక్ష నిర్వహించారని తెలిపారు. రెండున్నరేళ్లుగా పోలవరానికి ట్రాన్స్‌టాయ్ ఏం చేయలేకపోయిందన్నారు. వైఎస్ హయాంలో కాల్వలు మాత్రమే తవ్వారని టీడీపీ విమర్శిస్తోంది. కానీ ముందుగా కాల్వలు తవ్వడం వల్లే ప్రాజెక్టుపై భారం తగ్గిందన్న మంత్రి.. టీడీపీ కేవలం 3 వేల కుటుంబాలకు మాత్రమే పునరావాసం కల్పించింది. కాపర్ డ్యాం వల్ల 18 వేల కుటుంబాలు ముంపునకు గురవుతాయన్న మంత్రి.. వారికి పునరావాసం కల్పించాలనే ఉద్దేశమే టీడీపీకి లేదన్నారు. ఎంత ఖర్చయినా ఫర్వాలేదు, కేంద్రం నిధులతో సంబంధం లేకుండా ముందుగా పునరావాసం కల్పించాలని జగన్ ఆదేశించారని మంత్రి తెలిపారు.


By July 19, 2019 at 09:38AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/tdp-vs-ysrcp-hot-debate-on-polavaram-project-in-andhra-pradesh-assembly/articleshow/70287377.cms

No comments