Breaking News

20 ఏళ్ల కిందట రూ.200 బాకీ.. అది తీర్చడానికి భారత్‌కు వచ్చిన ఓ విదేశీ మంత్రి!


తాను 20 ఏళ్ల కిందట ఇవ్వాల్సిన రూ.200 చెల్లించడానికి కెన్యా విదేశాంగ శాఖ మంత్రి భారత్‌కు విచ్చేశాడు. ఆఫ్రికా ఖండంలోని కెన్యా నుంచి సుమారు 5,013 కిలోమీటర్లు ప్రయాణించి మహారాష్ట్రలోని ఔరాంగాబాద్‌‌కు మంత్రి రిచర్డ్‌ టోంగ్డీ వచ్చారు. ఆయన ఔరంగాబాద్‌లోని మౌలానా కాలేజీలో 20 ఏళ్ల కిందట విద్యాభ్యాసం చేశారు. ఆ సమయంలో వఖేహడేనగర్‌ ప్రాంతంలో ఉండేవారు. స్థానిక వ్యాపారి గవాలీ దుకాణం నుంచి నిత్యావసర సరుకులు తీసుకునేవారు. ఈ క్రమంలో ఆయనకు రూ.200 బాకీ పడ్డారు. ఆ డబ్బులు ఇవ్వకుండానే రిచర్డ్‌ స్వదేశానికి వెళ్లిపోయారు. ఇది జరిగి 20 ఏళ్లు గడిచిపోగా, రిచర్డ్ ప్రజాప్రతినిధిగా ఎన్నికై ప్రస్తుతం కెన్యా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి అయ్యారు. అయితే, తాను గవాలీ కుటుంబానికి రూ.200 బాకీ ఉన్న విషయాన్ని మాత్రం ఆయన మరచిపోలేదు. ఈ నేపథ్యంలో తన భార్యతో సహా మంగళవారం ఔరంగాబాద్‌ వచ్చి గవాలీ కుటుంబాన్ని కలిశారు. ఆయన కుమారుడు కాశీనాథ్‌ గవాలీకి తాను బాకీపడ్డ రూ.200 ఇవ్వబోయారు. అయితే, ఒక్కసారిగా భావోద్వేగానికి గురైన కాశీనాథ్‌ రూ.200 తీసుకోడానికి నిరాకరించారు. రిచర్డ్‌కు ఆతిథ్యమిచ్చి మంచి విందు ఏర్పాటుచేశారు. చదువుకునే రోజుల్లో తనకు గవాలీ కుటుంబం ఎంతగానో సహకరించిందని ఈ సందర్భంగా రిచర్డ్‌ తన భార్యకు వివరించారు.


By July 10, 2019 at 10:05AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/kenya-foreign-minister-richard-tongdi-visits-aurangabad-in-maharashtra/articleshow/70153160.cms

No comments