Breaking News

Hindupur: చెత్తకుప్పలో ప్రత్యక్షమైన పసికందు మృతదేహం


చెత్తకుప్పలో పసికందును పడేసిన ఘటన జిల్లా హిందూపురంలో కలకలం రేపింది. వాసవీ ధర్మసత్రం సమీపంలోని ఓ చెత్తకుప్ప వద్ద పసికందును కుక్క నోటికి కరుచుకుని వెళ్లడాన్ని స్థానికులు గమనించారు. దీంతో కంగారు పడిన వారు కుక్కను తరమగా అది శిశును అక్కడే వదిలేసి పారిపోయింది. స్థానికులు ఆ పసికందును కాపాడే ప్రయత్నం చేయగా అప్పటికే ప్రాణాలు కోల్పోయింది. హిందూపురంలోని వాసవీ ధర్మసత్రం సమీపంలోని చెత్తకుప్పలో ఆదివారం మధ్యాహ్నం గుర్తుతెలియని వ్యక్తులు పసికందును పారేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. సమీపంలోని రెండు ప్రవేటు ఆస్పత్రుల్లో విచారణ చేపట్టగా ఎలాంటి సమాచారం తెలియలేదు. శిశువును పడేసిన వ్యక్తులను గుర్తించేందుకు పోలీసులు సంఘటనా స్థలంలోని సీసీటీవీ పుటేజీని పరిశీలిస్తున్నారు. శని, ఆదివారాల్లో హిందూపురంలోని ఆస్పత్రుల్లో ప్రసవించిన వారి వివరాలు సేకరిస్తున్నారు. తల్లిదండ్రులే బిడ్డను పారేశారా? లేక ఎవరైనా ఎత్తుకొచ్చి పడేశారా? అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. అయితే పసికందును చెత్తకుప్పలో పడేయటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి దారుణాలకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరుతున్నారు.


By June 24, 2019 at 12:05PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/new-born-baby-body-found-at-garbage-in-hindupur/articleshow/69923559.cms

No comments