Breaking News

పంజాగుట్ట ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం.. కారు ఢీకొనడంతో పైనుంచి పడి బైకర్ మృతి


హైదరాబాద్‌లోని ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న బైక్‌ను వెనుక నుంచి కారు వేగంగా ఢీకొనడంతో ఓ వ్యక్తి ఫ్లైఓవర్‌ పైనుంచి కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. భీతిగొలిపేలా జరిగిన ఈ ప్రమాదంలో ఫ్లైఓవర్‌లపై ప్రయాణించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను మరోసారి గుర్తుచేసింది. శనివారం రాత్రి బేగంపేట నుంచి నాగార్జున సర్కిల్ వైపు వస్తున్న బైక్‌ను ఫ్లైఓవర్‌పై కారు వెనుక నుంచి ఢీకొంది. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఓ యువకుడు ఫ్లైఓవర్ పైనుంచి కింద పడిపోయాడు. సమాచారం అందుకున్న వెంటనే పంజాగుట్ట పోలీసులు అక్కడికి చేరుకుని క్షతగాత్రుడిని 108 వాహనంలో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి వద్ద లభించిన ఓటర్ కార్డు ఆధారంగా కరీంనగర్‌కు చెందిన తాజుద్దీన్ మహమ్మద్‌గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో కారు ముందు భాగం నుజ్జునుజ్జుకాగా.. బైక్‌ రూపరేఖలు లేకుండా తుక్కుగా మారిపోయింది. ఈ ప్రమాదం కారణంగా అర్ధరాత్రి పంజాగుట్ట ఫ్లైఓవర్‌‌పై ట్రాఫిక్ జామైంది. పోలీసులు కారును, బైక్‌ను క్రేన్‌ సాయంతో తొలగించి వాహన రాకపోకలు పునరుద్ధరించారు. కారు అతివేగం ప్రయాణించడం వల్లనే ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు.


By June 30, 2019 at 08:52AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/car-hit-bike-at-panjagutta-fly-over-one-dead/articleshow/70007590.cms

No comments