విభజన సమస్యలపై రెండో రోజు భేటీ.. ఆయన సూచనలకు ఏపీ అధికారులు ఓకే!

తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న అనేక సమస్యల పరిష్కారానికి ఏపీ, తెలంగాణ అధికారుల సమావేశం రెండో రోజు శనివారం కూడా కొనసాగింది. ఈ భేటీలో విభజన సమస్యల పరిష్కారంపై ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ప్రగతిభవన్లో తెలంగాణ, ఏపీ సీఎంలు , వైఎస్ జగన్ల నేతృత్వంలో శుక్రవారం నిర్వహించిన సమావేశానికి కొనసాగింపుగా ఈ ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఇందులో తెలంగాణ, ఏపీ ప్రభుత్వ సలహాదారులు రాజీవ్ శర్మ, అజేయ కల్లం, సీఎస్లు ఎస్కే జోషి, ఎల్వీ సుబ్రమణ్యం, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలు రామకృష్ణారావు, రాజేశ్వరరావులు పాల్గొన్నారు. దాదాపు మూడు గంటల పాటు సాగిన ఈ భేటీలో 18 అంశాలపై చర్చించారు. విభజన సమస్యలపై పరిజ్ఞానం ఉన్న టీఎస్ సలహాదారు రాజీవ్శర్మ చేసిన పలు సూచనలపై ఏపీ అధికారులు సానుకూలంగా స్పందించారు. ఇరు రాష్ట్రాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని దాదాపు అన్ని ప్రతిపాదనలపై నిర్ణయం తీసుకున్నారు. వీటికి సంబంధించి పది రోజుల వ్యవధిలో శాఖల వారీగా ముసాయిదాలను సిద్ధం చేయాల్సి ఉంటుంది. దీనిపై వచ్చేవారం తిరుపతిలో సమావేశమై చర్చించి ప్రతిపాదనలు రూపొందించనున్నారు. ప్రభుత్వ సలహాదారులు, సీఎస్ల నేతృత్వంలోని బృందం తుది ప్రతిపాదనలు రూపొందించి సీఎంలకు వాటిని సమర్పిస్తుంది. Read Also: విభజన చట్టంలో పేర్కొన్న 9, 10వ షెడ్యూళ్ల సంస్థల విభజనకు ఇరు రాష్ట్రాల అధికారులు ఆమోదం తెలిపారు. ఆస్తులు, అప్పులు, ఉద్యోగుల విభజనపై అంగీకారానికి రాగా, బకాయిలు, ఆదాయాల పంపకంపై నివేదిక రూపొందించాల్సి ఉంది. వాస్తవానికి తొమ్మిదో షెడ్యూల్లోని సంస్థల విభజనకు సంబంధించి షీలాభిడే కమిటీ ప్రతిపాదనలపై భిన్నాభిప్రాయాలున్నాయి. పదో షెడ్యూలులో హెడ్క్వార్టర్ అంశంపై వివాదం ఉంది. రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న డీఎస్పీల విభజన పది రోజుల్లో పూర్తి చేయాలని, దీని కోసం ఇద్దరు డీజీపీలు కూర్చుని నిర్ణయం తీసుకుంటారు. ఉమ్మడి రాష్ట్రంలోని పలువురు సీఐలకు విభజన సమయంలో డీఎస్పీలుగా పదోన్నతులు కల్పించారు. అయితే, విభజన తర్వాత వీరిని తెలంగాణకు కేటాయించగా ఆ ప్రభుత్వం వారిని తీసుకోవడానికి నిరాకరించింది. విద్యుత్ సంస్థల విభజన సమయంలో తమకు రూ.3,378 కోట్ల మేరకు బకాయిలు రావాలని ఏపీ వాదించగా.. తమకు రూ.2,400 కోట్ల బకాయిలు రావాలని తెలంగాణ వాదిస్తోంది. పౌరసరఫరాల సంస్థలో కేంద్రం నుంచి లెవీ కింద రూ.1,775 కోట్ల నిధులు రావాలని ఏపీ వాదించింది. రూ.600 కోట్లు మాత్రమే వస్తాయని తెలంగాణ చెబుతోంది. వీటిపై వాస్తవ లెక్కలను సమర్పించాలని సమావేశంలో ఉన్నతాధికారులు ఆదేశించారు. నిర్ణయాల్లో కొన్ని అధికారుల స్థాయిలో పూర్తి కానుండగా... మిగతావి సీఎంల స్థాయిలో రాజకీయ నిర్ణయం తీసుకోవాలి. దీనికి క్యాబినెట్ ఆమోదం కూడా అవసరం. దీంతో జులై రెండో వారంలో ముఖ్యమంత్రుల సమావేశం అమరావతిలో నిర్వహించాలనే ప్రతిపాదన ఉంది.
By June 30, 2019 at 08:51AM
No comments