Breaking News

కాటేసిన కరెంట్.. పెళ్లికొడుకు సహా నలుగురు మృతి


యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో పెను విషాధం చోటుచేసుకుంది. పెళ్లయిన రెండోరోజే పెళ్లికొడుకు, అతడి తల్లిదండ్రులు, మేనత్త కరెంట్ షాక్‌తో ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. భూదాన్‌ పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ముఖ్తాపూర్‌ గ్రామానికి చెందిన చిందం ప్రవీణ్‌(22)కు ఈ నెల 19న ఓ యువతితో పెళ్లి జరిగింది. పెళ్లికుమార్తె ఇంటి వద్ద కార్యక్రమాలను ముగించుకున్న ప్రవీణ్ కుటుంబం శుక్రవారం గ్రామానికి చేరుకుంది. రాత్రి సమయంలో ప్రవీణ్ తల్లి బట్టలు ఇనుప వైర్‌పై బట్టలు ఆరేస్తుండగా కరెంట్ షాక్ కొట్టింది. దీంతో ఆమె కేకలు వేయగా ప్రవీణ్‌తో పాటు అతడి తండ్రి, మేనత్త పరుగుపరుగున అక్కడికి చేరుకుని ఆమెను పట్టుకున్నారు. దీంతో అందరికీ షాక్ కొట్టి పడిపోయారు. దీంతో నలుగురిని బంధువులు హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. పెళ్లికుమారుడు చిందం ప్రవీణ్‌(22), అతడి తల్లిదండ్రులు సాయిలు(55), గంగమ్మ(50), వలిగొండ మండలం తుమ్మలగూడేనికి చెందిన పెళ్లి కుమారుడి మేనత్త గంగమ్మ(48) ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సీరియల్ బల్బుల జీఐ తీగ ద్వారా బట్టలు ఆరేసే తీగకు విద్యుత్ సరఫరా జరగడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పెళ్లయిన రెండ్రోజులకు భర్తను కోల్పోయిన వధువు షాక్‌లోకి వెళ్లిపోయింది.


By June 22, 2019 at 11:46AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/4-dead-with-groom-in-bhoodan-pochampally-over-electric-shok/articleshow/69901105.cms

No comments