లడ్డూ ఆశచూపి ఏడేళ్ల బాలికను చీకటి గదిలోకి తీసుకెళ్లి..
ఒంగోలు మహిళలపై అఘాయిత్యాలకు నిలయంగా మారుతోంది. ఒంగోలులో 16ఏళ్ల బాలికపై 5రోజుల పాటు సాగిన సామూహిక అత్యాచార ఘటన కలకలం రేపుతుండగా ఏడేళ్ల బాలికపై అత్యాచారయత్నం ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై తాలూకా పోలీస్స్టేషన్లో శనివారం రాత్రి కేసు నమోదైంది. రాజస్థాన్కు చెందిన నవరామ్(20) ఒంగోలులోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గల స్వీట్ షాపులో పనిచేస్తున్నాడు. సమీపంలోనే ఓ కుటుంబానికి చెందిన బాలిక శనివారం స్వీట్ షాప్ దగ్గర వెళ్లడాన్ని గమనించిన నవరామ్ ఆమెను పిలిచి మాట్లాడాడు. ఆ తర్వాత లడ్డూ ఇస్తానని ఆశచూపి షాపు వెనుక వైపునున్న చీకటి ప్రదేశానికి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. తమ కుమార్తె కనిపించకపోవడంతో ఆందోళన పడిన తల్లిదండ్రులు అటువైపుగా వెతకగా బాలిక ఏడుపు వినిపించింది. దీంతో చీకటి ప్రదేశానికి వెళ్లి చూడగా బాలిక భయపడుతూ రోదిస్తూ కనిపించింది. బాలిక తల్లిదండ్రులను చూసిన నవరామ్ అక్కడి నుంచి పరారయ్యాడు. అసలేం జరిగిందని తల్లిదండ్రులు బాలికను ప్రశ్నించగా నవరామ్ తనపై ప్రవర్తించిన తీరు తనతో ప్రవర్తించిన తీరును వివరించింది. దీంతో వారు బాలికను వెంటబెట్టుకుని పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు పోక్సో చట్టం కింద నవరామ్పై కేసు నమోదు చేసి అతడి కోసం గాలిస్తున్నారు.
By June 23, 2019 at 11:44AM
No comments