Breaking News

దుబాయ్ పేరుతో మోసం.. మహిళను లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారం


దుబాయ్‌లో మంచి ఉద్యోగం ఇప్పిస్తానని యువతిని నమ్మించిన ఓ ఏజెంట్ ఆమెను చెన్నై, హైదరాబాద్‌ నగరాలు తిప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఏజెంట్ తనను మోసం చేసి లైంగికంగా వాడుకుంటున్నాడని గమనించిన బాధితురాలు చివరికి ధైర్యం చేసి అతడిని పోలీసులకు అ ప్పగించింది. ఈ ఘటన సికింద్రాబాద్‌లో జరిగింది. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటకు చెందిన యువతి ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటంతో దుబాయ్‌కి వెళ్లి ఉపాధి పొందాలనుకుంది. అదే ప్రాంతానికి చెందిన నర్సింహమూర్తి అనే ఏజెంట్ యువతి పరిస్థితి తెలుసుకుని ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. దుబాయిలో ఉద్యోగం ఇప్పించాలని యువతి కోరడంతో వీసా ప్రాసెసింగ్ పేరుతో ఆమెతో పాటు మరో మహిళను ఈ నెల 18వ తేదీన చెన్నై తీసుకెళ్లాడు. యువతితో పాటు వెళ్లిన ఆమెకు వీసా రావడంతో తిరిగి వెళ్లిపోయింది. యువతి వీసా కోసం మరికొన్ని రోజులు ఇక్కడే ఉండాల్సి వస్తుందని ఆమెను ఓ లాడ్జిలో ఉంచాడు. అదే రోజు రాత్రి యువతిని బెదిరించిన నర్సింహమూర్తి తన లైంగిక కోరిక తీర్చుకున్నాడు. ఆ తర్వాత పాస్ట్‌పోర్టు ఆఫీసులో పనుందని చెప్పి యువతితో పాటు నగరానికి చేరుకున్నాడు. 22వ తేదీన సికింద్రాబాద్‌లోని గోపాలపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ లాడ్జిలో రూమ్‌కు తీసుకుని అక్కడ మరోసారి ఆమెపై చేశాడు. ఆదివారం మరోసారి అఘాయిత్యానికి ప్రయత్నించడంతో యువతి ఎదురు తిరిగింది. నర్సింహమూర్తి తనను దుబాయ్ పంపించకుండా లైంగికంగా వాడుకుంటున్నాడని గ్రహించి బాత్‌రూమ్‌లోకి వెళ్లి డోర్ పెట్టుకుంది. దీంతో కంగారుపడిన నర్సింహమూర్తి తన వస్తువులు, యువతి పాస్‌పోర్టు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలి కేకలు విన్న లాడ్జి సిబ్బంది వెంటనే ఆ రూమ్‌కి చేరుకుని బాధితురాలిని కాపాడారు. వివరాలు కనుక్కుని గోపాలపురం పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని బాధితురాలి నుంచి ఫిర్యాదు స్వీకరించారు. నిందితుడు నర్సింహమూర్తిపై అత్యాచారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సోమవారం సాయంత్రం నిందితుడిని అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.


By June 26, 2019 at 12:14PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/east-godavari-woman-raped-by-dubai-agent-in-hyderabad/articleshow/69954269.cms

No comments