Breaking News

‘కేసీఆర్‌తో యుద్ధం ఎప్పుడు చేయాలో, ఎప్పుడు స్నేహం చేయాలో జగన్‌కు తెలుసు’


తెలంగాణ సీఎంతో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి భేటీని అభినందిస్తూనే ఎంపీ చురకలంటిస్తూ సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై నేత కౌంటర్ ఇస్తూ ట్విట్టర్‌లో విరుచుకుపడ్డారు. కేసీఆర్‌తో చంద్రబాబునాయుడు ఘర్షణ వైఖరిని అవలంభించినంత మాత్రాన జగన్ కూడా అదే పని చేయాలా? అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ఎప్పుడు యుద్ధం చేయాలో తమ సీఎంకు తెలుసుంటూ ట్వీట్ చేశారు. అలాగే మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును కూడా టార్గెట్ చేస్తూ వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు. అలాగే ప్రజావేదిక కూల్చివేతపై టీడీపీ నేతలతో చంద్రబాబు నిర్వహించిన సమావేశంపై కూడా విజయసాయి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశం అయ్యారంటే ప్రజా సమస్యలపై చర్చించి ప్రభుత్వానికి విలువైన సూచనలేమైనా చేస్తారనుకున్నాం. కానీ ఆయన అద్దెకు ఉంటున్న ఇంటికి నోటీసులివ్వడంపైనా, నారావారిపల్లెలోని భవనానికి కాపలా తగ్గించడం పైన సంతాప తీర్మానాలు చేశారు. అంటే మీ సమస్యే ప్రజా సమస్యా?’అంటూ ఎద్దేవా చేశారు. ‘కేశినాని గారూ ఇకనైనా మారండి. మీ అధినేత బీజేపీని సమర్థిస్తే అందరూ జై కొట్టాలి. యూ-టర్ను తీసుకుని కాంగ్రెస్ గుంపులో చేరితే అది గొప్ప నిర్ణయమనాలి. తెలంగాణ సీఎంతో ఘర్షణ వైఖరి అవలంబిస్తే మేమూ అదే చేయాలా? యుద్ధం ఎప్పుడు చేయాలో, సామరస్యంగా ఎప్పుడు మెలగాలో మా సీఎం గారికి తెలుసు’అని వ్యాఖ్యానించారు. ‘బహుదా-వంశధార-నాగావళి లింక్‌ పనులను ఐదేళ్లలో మీరెందుకు పూర్తి చేయలేక పోయారు ఉమా? వనరుల దోపిడీకి తప్ప ఉత్తరాంధ్రను మీరు పట్టించుకున్నదెపుడు? ఏటా వృథాగా సముద్రంలో కలుస్తున్న 3,500 టిఎంసీల గోదావరి నీటితో ప్రతి ఎకరాకు జలాభిషేకం చేస్తారు సీఎం జగన్ గారు’ అని అన్నారు.


By June 30, 2019 at 12:33PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/ycp-mp-vijaya-sai-reddy-counter-to-tdp-mp-kesineni-nani-tweets/articleshow/70009222.cms

No comments