Breaking News

Kedarnath: భారీ హిమపాతం, వర్షాలపై ఐఎండీ హెచ్చరిక.. కేదార్‌నాథ్ యాత్రకు బ్రేక్


ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి నాలుగు పుణ్యక్షేత్రాలను చార్‌ధామ్ యాత్రగా పరిగణిస్తారు. ఈ యాత్ర ఏడాది ఆరు నెలలు మాత్రమే సాగుతుంది. దట్టమైన మంచు కారణంగా మిగతా ఆరు నెలలు ఆలయాలను మూసివేస్తారు. అక్టోబరు నుంచి ఏప్రిల్‌ వరకూ అక్కడ మంచు పేరుకుపోతుంది. చార్‌ధామ్ యాత్రను ఏటా అక్షయ తృతీయ (ఏప్రిల్ 22) నాడు అధికారికంగా ప్రారంభిస్తారు. ఆ రోజు గంగోత్రి, యమునోత్రి ఆలయాలు తెరుచుకుంటాయి. తర్వాత కేదార్‌నాథ్ ఆలయం, బద్రీనాథ్ ఆలయం తెరుచుకుంటాయి.

By May 02, 2023 at 10:51AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/imd-alert-heavy-snowfall-on-kedarnath-dham-route-in-uttarakhand/articleshow/99924220.cms

No comments