Breaking News

భారత్, చైనా రక్షణ మంత్రుల సమావేశం.. డ్రాగన్‌కు రాజ్‌నాథ్ స్ట్రాంగ్ మెసేజ్


వాస్తవాధీన రేఖ వెంబడి తూర్పు లడఖ్ సరిహద్దుల్లో భారత్, చైనాల మధ్య గత మూడేళ్లుగా ప్రతిష్టంభన కొనసాగుతోంది. 2020 జూన్ 15న గల్వాన్ లోయలో ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ చోటుచేసుకోగా.. 20 మంది భారత జవాన్లు అమరులయ్యారు. ఈ నేపథ్యంలో ఘర్షణ తర్వాత మొదటిసారిగా భారత్, చైనా రక్షణ మంత్రులు ఢిల్లీలో గురువారం భేటీ అయ్యారు. ఢిల్లీలో జరగనున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సమావేశాల కోసం చైనా రక్షణ మంత్రి భారత్‌కు విచ్చేశారు.

By April 28, 2023 at 08:23AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/india-strong-message-to-china-on-border-row-as-defence-ministers-meet/articleshow/99830217.cms

No comments