Breaking News

Shyam Saran Negi: భారత తొలి ఓటరు ఇక లేరు... శ్యామ్ శరణ్ నేగి మృతి.. 1951 నుంచి ఓటు వేస్తూనే ఉన్న వ్యక్తి


స్వతంత్ర భారత దేశంలో మొట్టమొదటిసారిగా ఓటువేసిన వ్యక్తి శ్యామ్ శరణ్ నేగి (Shyam Saran Negi).అలాంటి వ్యక్తి నవంబర్ 2వ తేదీన కన్నుమూశారు. అనారోగ్యంతో చనిపోయిన ఆయన 1951 నుంచి ఇప్పటి వరకు తన ఓటు హక్కును ఒక్కసారి కూడా మిస్ చేసుకోలేదు. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల 2022కి చివరి ఓటు వేశారు. శ్యామ్ మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ కూడా సంతాపం తెలియజేశారు. శ్యామ్ ఎన్నోసార్లు దేశంలో అప్పటి విశేషాలను ఇప్పటి తరానికి చెప్పారు.

By November 05, 2022 at 01:34PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/independent-indias-first-voter-shyam-saran-negi-passes-away-at-106-age/articleshow/95317812.cms

No comments