Breaking News

Kerala: రాహుల్ యాత్రకు రూ.2 వేలు ఇవ్వాలని.. కూరగాయలు అమ్ముకునే వ్యక్తిపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి


కేరళలో (Kerala) ముగ్గురు కాంగ్రెస్ కార్యకర్తలపై వేటు పడింది. భారత్ జోడో యాత్రకు విరాళాలు ఇవ్వాలని కోరుతూ ఓ కూరగాయల వ్యాపారిపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. రూ.2000లు అడిగారు.. రూ.500లే ఇవ్వడంతో ఆగ్రహానికి గురయ్యారు. షాపులో ఉన్న వస్తువులను ధ్వంసం చేశారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో వైరల్ అయింది. అయితే దీనిపై కాంగ్రెస్ పార్టీ వెంటనే చర్యలు తీసుకుంది. ఆ ముగ్గురిని సస్పెండ్ చేసింది. వారిపై పోలీసు కూడా నమోదైంది.

By September 16, 2022 at 01:52PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/congress-workers-attack-on-vegetable-vendor-for-bharat-jodo-yatra-donation/articleshow/94242847.cms

No comments