Kerala: రాహుల్ యాత్రకు రూ.2 వేలు ఇవ్వాలని.. కూరగాయలు అమ్ముకునే వ్యక్తిపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhr2RcoK5Nf9NTRnPrStQ3-ZEfWwNyAVOOY6PB6ANhCKZnZochRr_RqPaaDi69eUIGsDRKvoByMaFr3cDoUjes5s8YnYK1JmNBBqqCvhrWe7EYyAph699mJoYmlAtAa9N1iUdMDhRpkjdA/s1600/telugu+news.png)
కేరళలో (Kerala) ముగ్గురు కాంగ్రెస్ కార్యకర్తలపై వేటు పడింది. భారత్ జోడో యాత్రకు విరాళాలు ఇవ్వాలని కోరుతూ ఓ కూరగాయల వ్యాపారిపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. రూ.2000లు అడిగారు.. రూ.500లే ఇవ్వడంతో ఆగ్రహానికి గురయ్యారు. షాపులో ఉన్న వస్తువులను ధ్వంసం చేశారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో వైరల్ అయింది. అయితే దీనిపై కాంగ్రెస్ పార్టీ వెంటనే చర్యలు తీసుకుంది. ఆ ముగ్గురిని సస్పెండ్ చేసింది. వారిపై పోలీసు కూడా నమోదైంది.
By September 16, 2022 at 01:52PM
By September 16, 2022 at 01:52PM
No comments