Breaking News

Gorakhpur: సీఎం సొంతూరులో కొత్త పంచాయితీ... ఆత్మరామ్‌ నగర్‌గా మారిన జాఫ్రా బజార్


ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో (Gorakhpur) కొత్త పంచాయితీ మొదలైంది. గోరఖ్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్ జారీ చేసిన ముసాయిదా ఉత్తర్వుల్లో 12 వార్డుల ముస్లిం పేర్లను మార్చేశారు. దీంతో కొత్త దుమారం రేపింది. దీనిపై విపక్షాలు తీవ్రంగా విరుచుకుపడ్డాయి. పేర్లను మారుస్తూ డబ్బులు వృథా చేస్తున్నారని విమర్శించారు. మున్సిపల్ కార్పొరేషన్ ఉత్తర్వుల ప్రకారం ఇకపై 80 వార్డులు ఉంటాయి. గోరఖ్‌పూర్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వస్థలం. కొత్త వార్డులు పెరుగుదలతో పాటు.. పేర్లను కూడా మార్చారు.

By September 04, 2022 at 01:28PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/muslim-names-of-wards-changes-in-draft-order-from-gorakhpur-of-uttar-pradesh/articleshow/93981593.cms

No comments