Breaking News

Mathura జన్మాష్టమి వేడుకల్లో తొక్కిసలాట.. ఇద్దరు భక్తులు మృతి


భగవాన్ కృష్ణుడి జన్మదిన వేడుకలు దేశవ్యాప్తంగా అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. భగవానుడి జన్మస్థలంగా భావించే మథురలో అర్థరాత్రి వేళ వేడుకలను నిర్వహించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో శుక్రవార రాత్రి నిర్వహించిన వేడుకలకు భారీగా భక్తులు రావడంతో పరిస్థితి అదుపుతప్పింది. ఇది తొక్కిసలాటకు దారితీసి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. హఠాత్తుగా భక్తుల పెద్ద సంఖ్యలో దూసుకురాగా.. హారతి ఇస్తున్న సమయంలో రద్దీ పెరిగిపోయి పరిస్థితి చేజారిందని మథుర పోలీసులు తెలిపారు.

By August 20, 2022 at 10:42AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/two-suffocate-to-death-amid-janmashtami-rush-in-mathura-temple-in-up/articleshow/93672174.cms

No comments