Breaking News

కన్నతల్లి శవాన్ని బైక్‌పై కట్టుకుని.. 80 కిలోమీటర్ల ప్రయాణం.. వీడియో వైరల్..!


కన్నతల్లి కళ్ల ఎదుటే మరణిస్తే అది ఎంత బాధాకరం చెప్పనక్కర్లేదు. అలాంటిది కళ్లెదుటే చనిపోయిన కన్నతల్లి శవాన్ని ఇంటిదాకా తీసుకెళ్లేందుకు అంబులెన్స్ లేక.. ఓ యువకుడు పడిన అవస్థ, ఆవేదనతో కూడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తల్లి మృతదేహంతో 80 కిలోమీటర్లు ప్రయాణించిన ఈ అమానవీయ ఘటన నెటిజన్ల మనస్సును కదిలించింది. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లోని షాడోల్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి దగ్గర చోటుచేసుకుంది.

By August 02, 2022 at 08:10AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/man-forced-to-carry-mother-corpse-80-kms-on-bike-after-ambulance-denied-in-madhya-pradesh/articleshow/93286208.cms

No comments