Breaking News

UK heatwave:ఎండకు రైలు పట్టాలు కాలిపోయాయ్...!


లండన్‌లో అధిక ఉష్ణోగ్రతలు (UK heatwave) నమోదవుతున్నాయి. దాంతో అక్కడి ప్రజలు వేడితో సతమతం అవుతున్నారు. దాంతో అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వేడి తట్టుకునే విధంగా ఇళ్లలోనే ఉండాలని సూచించారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. వచ్చే వారాంతం వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని అక్కడి అధికారులు అంటున్నారు. అయితే అత్యధిక ఉష్ణోగ్రతలు కారణంగా అక్కడి రైలు పట్టాలపై మంటలు చెలరేగాయి. వెంటనే సిబ్బంది అప్రమత్తమై వాటిని అదుపు చేసింది.

By July 11, 2022 at 11:16PM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/train-tracks-burst-into-flames-amid-soaring-temperatures-in-london/articleshow/92811749.cms

No comments