Breaking News

Parliament: నోరుజారిన కాంగ్రెస్ నేత.. రాష్ట్రపత్ని అంటూ ద్రౌపది ముర్ముపై కామెంట్


కాంగ్రెస్ నాయకుడు అధీర్ రంజన్ ద్రౌపది ముర్మును ఉద్దేశించి మాట్లాడిన మాటలు పార్లమెంట్‌లో (Parliament)పెద్ద దుమారాన్ని సృష్టించాయి. ఆయన ద్రౌపది ముర్మను రాష్ట్రపత్ని అంటూ కామెంట్ చేశారు. దాంతో బీజేపీ మండిపడింది. బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రపతి ముర్మను తీవ్రంగా అవమానించారని బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ అన్నారు. దీనిని ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా ఆమోదించారన్నారు. కాగా దీనిపై అధీర్ రంజన్ స్పందిస్తూమ నోరుజారానని అన్నారు.

By July 28, 2022 at 12:39PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/parliament-adjourned-after-uproar-over-congress-leader-ar-chowdhury-rashtrapatni-comments/articleshow/93180863.cms

No comments