Tamil Nadu ఊబిలో చిక్కుకుని ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు బాలికలు మృతి

తమ ఊరి సమీపంలో ఓ నదిపై జలాశయం నిర్మించగా.. వేసవి కాలం కావడంతో నీళ్లు తగ్గిపోయాయి. అయితే, ఓ కుటుంబానికి చెందిన ఏడుగురు బాలికలు అక్కడ స్నానానికి వెళ్లారు. తొలుత నలుగురు లోపలికి స్నానం కోసం దిగగా.. ఊబిలోకి జారుకున్నారు. వీరిని కాపాడాలని మిగతా అమ్మాయిలు ప్రయత్నించగా మొత్తం ఏడుగురూ బురదలో కూరుకుపోయాయి. వీరిలో ఇటీవలే పెళ్లి చేసుకున్న ఓ యువతి కూడా ఉండటం బాధాకరం. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాదం నెలకుంది.
By June 06, 2022 at 11:12AM
By June 06, 2022 at 11:12AM
No comments