Breaking News

పంజాబ్‌లో యువకుడి దారుణ హత్య.. కత్తులతో వెంబడించి చంపిన దుండగులు


పంజాబ్‌లో మరో ఘోరమైన సంఘటన చోటుచేసుకుంది. ప్రముఖ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య మరుకవ ముందే మరో హత్య జరిగింది. మోగా మార్కెట్‌లో ఓ యువకుడిని ఆరుగురు వ్యక్తులు వెంబడించి మరీ పొడవైన కత్తులతో ప్రాణం తీశారు. గాయాలపాలైన ఆ యువకుడిని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్టు వైద్యులు తెలిపారు. దాంతో అక్కడ స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మరోవైపు ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. దీనికి సంబంధించిన సీసీటీవీ వీడీయో బయటకు వచ్చింది.

By June 05, 2022 at 07:35AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/mob-brutally-murders-youth-in-busy-moga-market-of-punjab/articleshow/92013125.cms

No comments