Breaking News

నేడే రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము నామినేషన్


ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము శుక్రవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇప్పటికే ఆమె ఢిల్లీకి చేరుకున్నారు. ఈ మేరకు బీజేపీ నాయకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ముర్ముకు ఎలక్టోరల్ కాలజీలో మెజారిటీ మద్దతు ఉంది. ఇక ప్రతిపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హాను బరిలోకి దింపాయి. జూన్ 27న సిన్హా తన నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. ఈయన అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ప్రకటించారు.

By June 24, 2022 at 09:43AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/draupadi-murmu-will-file-nomination-as-nda-president-candidate-on-friday/articleshow/92426054.cms

No comments