Breaking News

అనంత్‌నాగ్‌లో ఎన్‌కౌంటర్.. హిజ్బుల్ కీలక ఉగ్రవాది హతం


అమర్‌నాథ్ యాత్రకు విఘాతం కలిగించి యాత్రికులను భయాందోళనకు గురిచేసేలా పాక్ ఉగ్రవాదులు చేస్తున్న ప్రయత్నాలను సైన్యం తిప్పికొడుతోంది. ఈ నేపథ్యంలో అనంత్‌నాగ్ జిల్లాలో హిజ్బుల్ ఉగ్రవాదిని సైన్యం హతమార్చింది. శుక్రవారం సాయంత్రం నుంచి మొదలైన ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. ఆ ప్రాంతమంతా సైన్యం జల్లెడ పడుతోంది. మరోవైపు, కశ్మీర్‌లోని మైనార్టీలపై జరుగుతున్న దాడులను అరికట్టే చర్యలకు కేంద్రం ఉపక్రమించింది. కశ్మీర్ పండిట్లను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని నిన్న జరిగిన బేటీలో నిర్ణయించారు.

By June 04, 2022 at 09:29AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/hizbul-commander-killed-in-anantnag-encounter-in-jammu-and-kashmir/articleshow/91997684.cms

No comments