Breaking News

ఫోర్త్ వేవ్ అలర్ట్.. 24 గంటల్లో 5 వేలకుపైగా కరోనా కేసులు నమోదు


భారత్‌లో కరోనా నాలుగో వేవ్ మొదలైన సూచనలు కనిపిస్తున్నాయి. గత 24 గంటల్లో 5 వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు రోజుతో పోలిస్తే కోవిడ్ కేసుల్లో 40 శాతం పెరుగుదల నమోదైంది. ఇదే సమయంలో ఏడుగురు కోవిడ్‌కు బలయ్యారు. పొరుగున ఉన్న మహారాష్ట్రలో గత 24 గంటల్లో 1881 కేసులు నమోదయ్యాయి. కేసులు వేగంగా పెరుగుతుండటంతో.. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. ప్రస్తుతం మన దేశంలో 29 వేలకు చేరువలో యాక్టివ్ కేసులు ఉన్నాయి.

By June 08, 2022 at 09:49AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/india-reports-5233-covid-19-cases-and-7-deaths-in-last-24-hours/articleshow/92072752.cms

No comments