Breaking News

అర్ధరాత్రి విచారణ.. బీజేపీ నేత తజిందర్ పాల్ సింగ్ బగ్గాకు ఊరట


బీజేపీ నాయకుడు తజిందర్ పాల్ సింగ్ బగ్గాకు ఊరటనిస్తూ హర్యానా, పంజాబ్ హైకోర్టు తీర్పునిచ్చింది. బగ్గాపై మొహలీ కోర్టు జారీ చేసిన అరెస్ట్ వారెంట్‌ను సవాల్ చేస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు శనివారం అర్ధరాత్రి విచారణ జరిపి.. తజిందర్ పాల్ సింగ్ బగ్గాకు అనుకూలంగా తీర్పునిచ్చింది. మే పదో తేదీ వరకూ ఆయనపై బలవంతపు చర్యలు తీసుకోవద్దని సూచించింది. కాగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో తజిందర్ పాల్ సింగ్‌ను అరెస్ట్ చేశారు.

By May 08, 2022 at 10:07AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/haryana-and-punjab-high-court-restrains-police-from-taking-coercive-action-against-tajinder-bagga/articleshow/91412238.cms

No comments