Breaking News

భీమ్లా నాయక్ సీక్రెట్: అందుకే అలా చేశామంటూ తమన్ ఓపెన్


కరోనా పరిస్థితుల తర్వాత థియేటర్ల వద్ద పండగ వాతావరణం తీసుకొచ్చాడు 'భీమ్లా నాయక్'. పవర్ స్టార్ స్టామినా ఏంటనేది ఈ సినిమాతో మరోసారి రుజువైంది. అన్ని సెంటర్లలో భారీ రెస్పాన్స్ తెచ్చుకుంటున్న ఈ సినిమా కలెక్షన్స్ పరంగా యమ స్పీడులో ఉంది. విడుదల రోజే పాజిటివ్ రివ్యూలు రావడంతో సినిమాకు సూపర్ బూస్ట్ దొరికింది. ఫిబ్రవరి 25న విడుదలైన ఈ సినిమా సక్సెస్‌ఫుల్ రన్ కొనసాగిస్తుండగా.. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయటపెట్టారు మ్యూజిక్ డైరెక్టర్ . భీమ్లా నాయక్ సినిమాలో పవన్ కళ్యాణ్, పోటాపోటీ నటన ప్రేక్షకులకు మంచి కిక్ ఇచ్చింది. ముఖ్యంగా అభిమానులకు విజువల్ ట్రీట్ ఇచ్చేలా కొన్ని సీన్స్ కట్ చేశారు. ఇందంతా బాగానే ఉన్నా సినిమాలో ఒక పాట కనిపించకపోవడం మాత్రం ప్రేక్షక లోకాన్ని ఆశ్చర్యపరిచింది. పవన్ కళ్యాణ్- నిత్య మీనన్ నడుమ షూట్ చేసిన 'అంత ఇష్టం ఏందయ్యా' అనే మెలోడీ సాంగ్ సినిమా విడుదలకు ముందే భారీ రెస్పాన్స్ తెచ్చుకుంది. తీరా విడుదల తర్వాత సినిమాలో ఈ సాంగ్ లేకపోవడం ఒకరకంగా ఫ్యాన్స్‌ని నిరాశ పరిచిందనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో అసలు ఆ సాంగ్ ఎందుకు కట్ చేయాల్సి వచ్చిందనే విషయమై ఓపెన్ అయ్యారు తమన్. 'మంచి వేడి మీద ఉన్న స్టవ్ మీద నీళ్ళు పోస్తే బాగుండదు కదా' అంటూ ఆయన రియాక్ట్ అయ్యారు. మంచి వేడి మీద సాగుతున్న సన్నివేశాల నడుమ కూల్‌గా అనిపించే ఈ సాంగ్ ఉంటే బాగుండదనే కారణంతో ఫైనల్ అవుట్‌పుట్ నుంచి ఈ పాటను తొలగించినట్లు తెలిపారు. ఇకపోతే 108 కోట్ల టార్గెట్ పెట్టుకొని బరిలోకి దిగిన భీమ్లా నాయక్ బాక్సాఫీస్ షేక్ చేస్తున్నాడు. మొదటి మూడు రోజుల్లోనే 60 కోట్లకు పైగా షేర్ రాబట్టి సత్తా చాటాడు. ఈ సినిమా రెస్పాన్స్ చూస్తుంటే మరికొన్ని రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ క్రాస్ అయ్యేలా ఉందని చెబుతున్నారు ట్రేడ్ పండితులు.


By March 01, 2022 at 08:49AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/music-director-thaman-says-secret-behind-bheemla-nayak-song-delete/articleshow/89912768.cms

No comments