Breaking News

థియేటర్‌పై రష్యా బాంబుల వర్షం.. లోపల ఆశ్రయం పొందుతున్న 1,200 మంది


ఉక్రెయిన్‌లో రష్యా మారణహోమం కొనసాగుతోంది. సాధారణ పౌరులే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నట్టు నివేదికలు అందుతున్నాయి. వ్యూహాత్మక రేవు నగరం మరియూపోల్‌లో పరిస్థితులు అత్యంత దయనీయంగా మారాయి. అక్కడ తాగడానికి నీరు, తినడానికి తిండిలేక 3 లక్షల మంది చిక్కుకున్నారు. రష్యా దళాలు మేరియుపొల్‌లో ఓ ఆస్పత్రిని స్వాధీనం చేసుకున్నాయి. అంతేకాకుండా చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన 400 మంది పౌరులను ఇళ్ల నుంచి ఆస్పత్రికి తీసుకెళ్లాయి. 100 మంది వైద్యులు, రోగులను కూడా నిర్బంధంలో ఉంచాయి.

By March 17, 2022 at 10:23AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/russia-strikes-mariupol-drama-theatre-sheltering-residents-say-ukriane/articleshow/90283137.cms

No comments