Breaking News

చత్తీస్‌గడ్: మావోయిస్టులకు ఇంజనీర్ భార్య విన్నపం.. కిడ్నాపైన పవార్, ఆనంద్ విడుదల


ఛత్తీస్‌గడ్‌లో మావోయిస్టుల చెరలో ఉన్న ఇద్దరు విడుదలయ్యారు. సమీపంలో ఐదు రోజుల క్రితం కిడ్నాప్ చేసిన ఇంజనీర్ అశోక్ పవార్, కార్మికుడు ఆనంద్ యాదవ్‌లను సురక్షితంగా వదిలేశారు. ఇంజినీర్ అశోక్ పవార్ భార్య తన భర్తను విడుదల చేయాలని మావోయిస్టులను కోరగా.. ఇద్దర్ని విడుదల చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గత శుక్ర‌వారం ఛ‌త్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలోని ఇంద్రావతి వంతెన దగ్గర నిర్మాణ పనుల పర్యవేక్షణలో ఉన్న.. ఇంజినీర్ అశోక్ పవార్‌తో పాటు కార్మికుడు ఆనంద్ యాదవ్‌ను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. పవార్ భార్య భార్య సోనాలి తన భర్తను విడిచిపెట్టాల‌ని మావోయిస్టులను అభ్యర్థించారు. తన కుటుంబ‌మంతా అశోక్ మీదే ఆధారపడి ఉందని.. తన భర్తకు ఎలాంటి హాని త‌ల‌పెట్టొద్దని కోరారు. తమ కుటుంబానికి న్యాయం చేయాలని.. త‌న భ‌ర్త ఏదైనా తప్పు చేసి ఉంటే క్షమించాలన్నారు. ఆ తర్వాతే పవార్, ఆనంద్‌లను మావోలు విడుదల చేశారు. గతేడాది కూడా ఇలాంటి ఘటనే మరొకటి జరిగింది. ఛత్తీస్‌గడ్‌లోని బీజాపూర్ జిల్లా మ‌న్‌కేళి వ‌ద్ద సివిల్ ఇంజినీర్ అజ‌య్ ల‌క్రా, అటెండ‌ర్ ల‌క్ష్మ‌ణ్‌ను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. ఆ మ‌రుస‌టి రోజే ల‌క్ష్మ‌ణ్‌ను విడుద‌ల చేయ‌గా.. అజ‌య్‌ను మాత్రం వదల్లేదు. భర్త అజయ్‌ను విడిపించేందుకు భార్య అర్పిత ఎవరూ చేయలేని సాహసం చేశారు. త‌న రెండేళ్ల కూతురిని తీసుకుని స్థానిక జ‌ర్న‌లిస్టుల స‌హాయంతో అడ‌విలోకి వెళ్లారు. అర్పిత ఏకంగా మావోయిస్టులను కలిశారు. త‌న భ‌ర్త‌ను ప్రాణాల‌తో వ‌దిలిపెట్టాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. తర్వాత మావోయిస్టులు ప్ర‌జాకోర్టు నిర్వ‌హించి అజ‌య్‌ను విడుదల చేశారు. ఇప్పుడు కూడా మావోయిస్టుల చెర‌లో ఉన్న మ‌రో ఇంజినీర్ భార్య తన భర్తను విడుద‌ల‌ చేయాలని కోరగా.. ఇద్దరూ సురక్షితంగా వచ్చారు.


By February 16, 2022 at 07:34AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/maoists-released-engineer-and-worker-after-5-days-in-chattisgarh/articleshow/89604578.cms

No comments