Breaking News

టీకాలు వేయించుకునే పిల్లలకు గిఫ్ట్‌లు


దేశవ్యాప్తంగా సోమవారం నుంచి పిల్లలకు అందించనున్నారు. దీనికోసం అన్ని రాష్ట్రాల్లో ఏర్పాట్లు చేశారు. అయితే పిల్లలకు వ్యాక్సిన్లు ఇవ్వడానికి ఢిల్లీ ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది. కొన్ని ప్రాంతాల్లో పిల్లలను ఆకర్షించే విధంగా వ్యాక్సినేషన్ కేంద్రాలను తీర్చిదిద్దారు. ఆ కేంద్రాల్లో ఆట వస్తువులు, పుస్తకాలు ఏర్పాటు చేశారు. ఆడుకోవడానికి ప్రత్యేక గదులను కేటాయించారు. అంతేకాదు కొవాగ్జిన్ టీకాలు వేయించుకునేవారికి గిఫ్టులు కూడా ఇవ్వనున్నారు. దీనికోసం లంచ్ బాక్సులు, వాటర్ బాటిళ్లను సిద్ధం చేశారు. ముంబైలోనూ పిల్లలకు టీకాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. బాంద్రాలోని అతిపెద్ద కొవిడ్ ఆసుపత్రిలో టీకా అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పిల్లలకు జనవరి 3వ తేదీ నుంచి టీకాలు ఇస్తామని కేంద్రం ప్రకటించింది. అప్పటి నుంచి కొవిన్ పోర్టల్లో పిల్లలు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. అర్హులైన పిల్లల పేర్లు నమోదు చేయాలని అధికారులు సూచించారు. దాంతో వ్యాక్సిన్‌ కేంద్రాల్లో కూడా రిజిస్ట్రేషన్‌ జరుగుతోంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న చిన్నారులందరికీ టీకాలు ఇవ్వనున్నారు. కోవిడ్ వైరస్ ప్రభావం నిజానికి చిన్నారుల్లో తక్కువగానే ఉంది. మొదటి నుంచి పిల్లలకు వైరస్ సోకిన కేసులు చాలా తక్కువగానే ఉన్నాయి. పిల్లల్లో వ్యాధినిరోధక శక్తి ఎక్కువ ఉండడం వల్ల వారిపై వైరస్ ప్రభావం తక్కువగా ఉంటుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి. అయితే తర్వాత థర్డ్ వేవ్‌లో పిల్లలపై ప్రభావం ఎక్కువ ఉంటుందనే వార్తలు వచ్చాయి. కరోనా వ్యాక్సిన్ పిల్లలలో తీవ్రమైన వ్యాధులు, ఆసుపత్రిలో చేరడం, మరణాల ప్రమాదాన్ని తగ్గిస్తుందనే విషయాన్ని పరిగణలోకి తీసుకుని 15 నుంచి 18 ఏళ్లలోపు పిల్లలకు టీకాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటికే యూరప్ దేశాల్లో పిల్లలకు టీకాలు ఇవ్వడం ఆరంభించాయి


By January 02, 2022 at 06:26PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/complete-arrangement-in-states-for-vaccination-for-children/articleshow/88649833.cms

No comments