Breaking News

విరుచుకుపడుతోన్న కరోనా.. 300 మంది పోలీసులకు పాజిటివ్


దేశంలో కోవిడ్ విరుచుకుపడుతోంది. కొన్ని గంటల సమయంలోనే కేసులు పెరుగుతున్నాయి. అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ముఖ్యంగా మహారాష్ట్ర, ఢిల్లీలో కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. దాంతో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా ఆంక్షలను మరింత కట్టుదిట్టం చేస్తున్నాయి. డాక్టర్ల నుంచి రాజకీయ ప్రముఖుల వరకూ కోవిడ్ బారిన పడుతున్నారు. తాజాగా కూడా కోవిడ్ బారిన పడ్డారు. ఢిల్లీలో అదనపు పోలీసు కమిషనర్ చిన్మయ్ బిశ్వాల్‌తో సహా 300 మందికి పైగా పోలీసు సిబ్బందికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌తో సహా అన్ని యూనిట్లు, అన్ని పోలీస్ స్టేషన్‌ల‌లో పోలీసులకు వైరస్ సోకింది. దీంతో ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ సోమవారం సమావేశం కానుంది. ఈ సందర్భంగా కర్ఫ్యూతో పాటు గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ ఏజెండాతో కరోనా పరిస్థితిపై చర్చించనున్నట్టు సమాచారం. కాగా ఢిల్లీలో ఆదివారం ఒక్కరోజే 22,751 మందికి కరోనా సోకింది. కరోనాతో 17 మంది మృతి చెందారు. కరోనా పాజిటివిటీ శాతం 23.53 శాతానికి పెరిగింది. గ‌తేడాది మే ఒకటో తేదీ నుంచి ఇంత పెద్ద మొత్తంలో కేసులు న‌మోద‌వ‌డం ఇదే మొద‌టిసారి. గ‌తేడాది మే ఒకటిన ఢిల్లీలో 25,219 కేసులు నమోదయ్యాయి. ఇదిలావుండగా 400 మంది పార్ల‌మెంట్ సిబ్బందికి శనివారం కరోనా సోకింది. మరికొన్ని పార్ల‌మెంట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్ బడ్జెట్ సమాశాలపై ఈ ప్రభావం ఉండే అవకాశం ఉంది.


By January 10, 2022 at 10:38AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/over-three-hundred-police-personnel-infected-with-covid-in-delhi/articleshow/88802845.cms

No comments