Breaking News

కొత్తగా 2.34 లక్షల మందికి కోవిడ్, 893 మంది మృతి, 3.52 లక్షల రికవరీలు


దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా.. లక్షల సంఖ్యలోనే రోజువారీ కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో 2 లక్షల 34 వేల 281 కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో 893 మంది చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,94,091కి చేరుకుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడించాయి. కోవిడ్ వైరస్ నుంచి మరో 3,52,784 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 94.21 శాతంగా ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 14.50 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో 18,84,937 యాక్టివ్ కేసులున్నాయి. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. శనివారం వరకు 165.6 కోట్లకు పైగా కోవిడ్ టీకాలు పంపిణీ జరిగినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో ఇప్పటి వరకూ 75 శాతం వయోజనులు వ్యాక్సిన్ రెండు డోసులను తీసుకున్నారు. ఇక కేరళ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తూనే ఉంది. అక్కడ 50 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్ తరహా ఆంక్షలను అమలు చేస్తోంది. వేలాది సంఖ్యలో రోజువారీ కేసులు వెలుగుచూడడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉండగా కర్ణాటకలో మాత్రం నైట్ కర్ఫ్యూను ఎత్తివేస్తూ ఆ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం నుంచి పాఠశాలలు కూడా ఓపెన్ కానున్నాయి. మిగిలిన రాష్ట్రాల్లో కోవిడ్ నిబంధనలు కొనసాగుతున్నాయి.


By January 30, 2022 at 11:23AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/india-logs-234281-new-covid-cases-with-893-deaths-in-the-last-24-hours/articleshow/89217214.cms

No comments