Breaking News

Godse Teaser: ఆ విషయం తెలుసుకోలేనంత కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారు.. చిరంజీవి పోస్ట్ వైరల్


దర్శకుడు గోపీ గణేశ్‌, నటుడు కాంబినేషన్‌లో రాబోతున్న కొత్త సినిమా ‘’. సామాజిక అంశాల నేపథ్యంలో నేటి పరిస్థితులకు అద్దం పట్టేలా ఈ సినిమా రూపొందిస్తున్నారు. CK స్క్రీన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసి మూవీపై ఆసక్తి పెంచేశారు. మెగాస్టార్ చిరంజీవి ఈ టీజర్ రిలీజ్ చేస్తూ చిత్రయూనిట్ మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెబుతూ ట్విట్టర్ ‌లో పోస్ట్ పెట్టారు. 'ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగిఉన్నాయో తెలుసుకోలేనంత కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారు' అంటూ జనాన్ని మేల్కొలిపే డైలాగ్‌తో ప్రారంభమైన ఈ టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ''సాధారణంగా ఉద్యోగం చేస్తే డబ్బులొస్తాయ్‌.. వ్యాపారం చేస్తే డబ్బులొస్తాయ్‌.. వ్యవసాయం చేస్తే డబ్బులొస్తాయ్.. కానీ, సేవ చేస్తున్నందుకు మీకు వంద, వేల, లక్షల కోట్లు ఎలా వస్తున్నాయ్‌ రా? ఎందుకంటే సేవ పేరుతో మీరు ప్రజలు సొమ్ము దోచుకుంటున్నారు కాబట్టి'' అని సత్యదేవ్ చెప్పిన పవర్‌ఫుల్ డైలాగ్ టీజర్‌లో హైలైట్ అవుతూ జనాన్ని ఆలోచింపజేసేలా ఉంది. ఈ చిత్రంలో గాడ్సే పాత్ర‌లో సత్యదేవ్‌ నటించగా.. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌గా నటించింది. నాగబాబు, తనికెళ్ళ భరణి, 30 ఇయర్స్ పృథ్వీ కీలకపాత్రలు పోషించారు. ఈ టీజర్ చూస్తుంటే గాడ్సే చిత్రంతో జన హితమైన సందేశం ఇవ్వబోతున్నారని స్పష్టమవుతోంది. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ ఇచ్చి అతిత్వరలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుంచాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.


By December 20, 2021 at 04:00PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/actor-satyadev-godse-movie-teaser-released-by-chiranjeevi/articleshow/88390568.cms

No comments