Breaking News

పాన్ ఇండియా నిజాయితీ ఏది? మీ కమీషన్ ఎంత? కలెక్షన్ రిపోర్ట్స్‌పై హీరో సిద్దార్థ్ సూటి ప్రశ్న


టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా సినిమాల హవా పెరుగుతోంది. రాజమౌళి రూపొందించిన 'బాహుబలి' ఇచ్చిన బూస్టింగ్‌తో స్టార్ హీరోలంతా పాన్ ఇండియా సినిమాల బాట పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం పలు పాన్ ఇండియా మూవీస్ షూటింగ్ దశలో ఉండగా.. మరికొన్ని రిలీజ్ అయ్యాయి. అయితే కొంతమంది నిర్మాతలు తమ సినిమా రిలీజ్ తర్వాత మూవీ ప్రమోట్ అయ్యేలా రిపోర్ట్స్ చెబుతున్నారనే టాక్ ఉంది. చిత్రయూనిట్ ప్రకటిస్తున్న అఫీషియల్‌ కలెక్షన్ల విషయంలో ఎంతో మందికి అనుమానున్నాయి. తాజాగా ఇదే ఇష్యూ టచ్ చేస్తూ సూటిగా మాట్లాడారు . పాన్ ఇండియా సినిమాల కలెక్షన్స్‌పై సిద్దార్థ్ చేసిన ట్వీట్ నెట్టింట రచ్చ చేస్తోంది. సినిమాల కలెక్షన్ రిపోర్ట్స్‌ను తప్పుగా చూపించడానికి ఎంత కమీషన్ ముడుతోంది? చాలా కాలంగా బాక్సాఫీస్ లెక్కలపై నిర్మాతలు ఫేక్ రిపోర్ట్స్ పెడుతున్నారు. పాన్ ఇండియా నిజాయితీ ఏది? అంటూ నిలదీసిన సిద్దార్థ్.. ఈ రోజుల్లో ట్రేడ్ వర్గాలు, మీడియా కూడా అధికారిక గణాంకాలివ్వడం ప్రారంభించాయని పేర్కొన్నారు. ఈ మధ్యకాలంలో సిద్దార్థ్ చేస్తున్న కామెంట్స్ వివాదాస్పదం అవుతున్నాయి. రీసెంట్‌గా సమంత ఇష్యూలో సిద్దార్థ్ పరోక్షంగా ఎంటర్ అయ్యారని ఆయన కామెంట్స్ చూసి జనం చర్చించుకున్నారు. సోషల్ మీడియాలో కొందరు స్టార్స్ కోట్లు ఖర్చుపెట్టి అభిమానుల్ని పెంచి పోషిస్తున్నారని, చివరికి తమ ఫ్యాన్సే తమని కాటేస్తారని గుర్తించలేక పోతున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. మళ్ళీ ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్ కలెక్షన్స్‌పై సిద్దార్థ్ ఇలా రియాక్ట్ కావడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. నిజంగానే కలెక్షన్స్ విషయంలో ఫేక్ రిపోర్ట్స్ స్ప్రెడ్ చేస్తున్నారా? అనేది జనాల్లో డిస్కషన్ పాయింట్ అయింది.


By December 23, 2021 at 11:59AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/hero-siddharth-comments-on-pan-india-movie-collection-reports/articleshow/88447513.cms

No comments