Breaking News

బెంగళూరులో కంపించిన భూమి.. భయంతో బయటకు పరుగులు తీసిన జనం


కర్ణాటక రాజధాని బెంగళూరులో భూమి కంపించింది. బెంగళూరుకు ఈశాన్య దిశలో రిక్టర్ స్కేల్‌పై 3.3 తీవ్రతతో ప్రకంపనలు నమోదయ్యాయి. బుధవారం ఉదయం 7 గంటల 9 నిమిషాల సమయంలో తొలి ప్రకంపనలు నమోదయ్యాయని నేషనల్ సెంటర్ ఫర్ సెసిమాలజీ తెలిపింది. బెంగళూరుకు 70 కిలోమీటర్ల దూరంలో భూగర్భంలో 11 కిలోమీటర్ల లోతున ఈ ప్రకంపనలు నమోదయ్యాయి. కాగా కాసేపటికే 7 గంటల 14 నిమిషాల సమయంలో ప్రకంపనలు నమోదయ్యాయి. బెంగళూరుకు 66 కిలోమీటర్ల దూరంలో భూగర్భంలో 23 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్ర స్థానం ఉన్నట్లు గుర్తించారు. రిక్టర్ స్కేలు‌పై 3.1 తీవ్రతతో ఈ ప్రకంపనలు నమోదయ్యాయి. ఉదయాన్నే భూప్రకంపనలను గమనించిన బెంగళూరువాసులు.. ఉలిక్కి పడ్డారు. చాలా మంది భయంతో ఇళ్ల నుంచి బయటకు పెట్టారు. ప్రకంపనలు ఆగిపోయిన తర్వాత మళ్లీ ఇళ్లలోకి వెళ్లారు.


By December 22, 2021 at 10:33AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/earthquake-in-bangalore/articleshow/88425198.cms

No comments