Breaking News

విస్తరిస్తున్న ఒమిక్రాన్ ... ఆ నాలుగు రాష్ట్రాల్లో హై అలర్ట్, 145కి చేరిన కేసులు


ఇండియాలో ఒమిక్రాన్ వేరియంట్ క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా శనివారం మరో 30 కేసులు నమోదయ్యాయి. దాంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 145కు చేరుకుంది. అయితే కొత్త కేసులన్నీ నాలుగు రాష్ట్రాల నుంచి నమోదుకావడం విశేషం. ఇందులో చాలా మంది బాధితులకు కేవలం స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నట్టు తెలుస్తుంది. దేశంలోని అ రాష్ట్రాలకంటే మహారాష్ట్రలో ఎక్కువ కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన 8 కేసులతో కలిపి ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 48కి చేరుకుంది. అయితే వీరందరికి ట్రావెల్ హిస్టరీ ఉన్నట్టు సంబంధిత అధికారులు తెలియజేశారు. తెలంగాణలోనూ కొత్తగా 12 మందికి టెస్ట్ చేయగా వారికి (ఒమిక్రాన్ వేరియంట్) పాజిటివ్‌గా తేలింది. దాంతో రాష్ట్రంలో మొత్తం సంఖ్య 20కి చేరింది. ఇందులో కొంతమంది విదేశీయులున్నారని, కొంతమంది ఇతర దేశాల నుంచి వచ్చినవాళ్లున్నారని సంబంధిత వైద్యాధికారి జి.శ్రీనివాసరావు తెలియజేశారు. కర్ణాటక, కేరళలోనూ కొత్త ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో 6 కొత్త కేసులు నమోదు కాగా.. అక్కడ కేసులు మొత్తం 14కు చేరుకున్నాయి. ఇందులో 13 నుంచి 18 ఏళ్లున్న అమ్మాయిలు ఉండడం విశేషం. వీరిలో ఒకరు యూకేకు వెళ్లొచ్చినట్లు సమాచారం. కేరళలో కొత్తగా నాలుగు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు బయటపడగా మొత్తం 11కు చేరుకున్నాయి. వీరంతా యూకే, టునిషియా, టాంజానీయ, కెన్యా దేశాలకు ప్రయాణం చేసినట్టు తెలుస్తుంది. దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమై కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. చాలా ఇప్పటికే మాస్క్ ధరించడం తప్పనిసరి చేయడంతో పాటు నిబంధనలు ఉల్లంఘించిన వారికి భారీ జరిమానాలు విధిస్తున్నాయి.


By December 19, 2021 at 11:24AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/145-omicron-cases-in-india-with-new-30/articleshow/88369150.cms

No comments