Breaking News

Kashmir రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. శ్రీనగర్‌లో కానిస్టేబుల్ దారుణ హత్య


జమ్మూ కశ్మీర్‌లో సాధారణ పౌరులపై ఉగ్రవాదుల దాడులతో అప్రమత్తమైన భద్రతా బలగాలు లోయలో అడుగడుగనా జల్లెడ పడుతున్నారు. డేగ కళ్లతో నిఘా ఉంచి, ముష్కరుల కోసం వేట కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. శ్రీనగర్‌లో ఆదివారం రాత్రి ఓ పోలీస్ కానిస్టేబుల్‌ను తీవ్రవాదులు కాల్చి చంపారు. బటమాలూ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనతో మరోసారి సైన్యం ఉలిక్కిపడింది. కానిస్టేబుల్‌పై తన ఇంటికి సమీపంలోనే ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ‘ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో విభాగానికి చెందిన తౌసిఫ్ అహ్మద్‌ అనే కానిస్టేబుల్‌పై బటమాలూలోని ఎస్డీ కాలనీలో అతడి ఇంటికి సమీపంలోనే ఉగ్రవాదులు కాల్పు జరిపారు’ అని ఓ అధికారి తెలిపారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన తౌసిఫ్‌ను శ్రీనగర్‌లోని ఎస్‌ఎంహెచ్ఎస్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతడు చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారని పేర్కొన్నారు. ఉగ్రవాదుల కాల్పుల గురించి సమాచారం అందుకున్న భద్రత బలగాలు అక్కడకు చేరుకున్నారు. ఆ ప్రాంతంలో ముష్కరుల కోసం గాలింపు చేపట్టాయి. ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనను నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ‘శ్రీనగర్‌లోని బటమాలూలో 29 ఏళ్ల పోలీస్ కానిస్టేబుల్‌పై దాడిచేసి అతడి ప్రాణాలు తీయడం పిరికిపంద, భయంకరమైన చర్య దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం... దీనిపై ఇంతకంటే చెప్పడానికి మాటలు రావడం లేదు.. అతడికి అల్లా ఆ స్వర్గంలో చోటు కల్పించాలి.. కష్టకాలంలో అతడి కుటుంబసభ్యులు, స్నేహితులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం’ అని ఆ పార్టీ ట్వీట్ చేసింది.


By November 08, 2021 at 06:06AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/jammu-and-kashmir-policeman-shot-dead-by-terrorists-in-srinagar/articleshow/87574927.cms

No comments